E-Paper
Advertisement

Kadapa accident: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

Kadapa accident: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి
Advertisement

Kadapa accident: ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భారీ కంటెనర్.. కారుని ఢీ కొట్టింది. మృతుల్లో ఐదుగురు కడప జిల్లాకు చెందినవారు.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారివెళ్దాం.. కడప జిల్లా వడ్డెపల్లెకు చెందిన లక్ష్మీదేవి భర్త సత్యనారాయణ ఇటీవల మరణించాడు. ఆయన కర్మకాండను ముగింపుకుని బంధువుల ఇంట్లో అడుగు పెట్టేందుకు కారులో ఐదుగురు బయలుదేరారు.

Advertisement

కారు గువ్వల చెరువు ఘాట్‌లో రెండో మలుపు వద్ద రాగానే..  అతివేగంగా వస్తున్న కంటైనర్ అదుపు తప్పి కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృత్యువాడ పడ్డారు. కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయాడు.  మృతులు కడప జిల్లా చక్రాయపేట మండలం వడ్డెపల్లెకు చెందిన నాగయ్య, చిన్న వెంకటమ్మ, నాగలక్ష్మీదేవి, షరీఫ్, కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నాడు.

ALSO READ: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Advertisement

కంటైనర్ చిత్తూరు జిల్లా నుంచి బ్యాటరీల లోడుతో మహారాష్ట్రకు వెళ్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. వేగానికి కంటైనర్ లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. లోయలోపడిన కంటైనర్ డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే కడప ఎస్పీ హర్షవర్థన్‌రాజు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×