BigTV English
Advertisement

Nara Lokesh: ఆ పదవికి లోకేష్ గుడ్ బై? ఆ ఛాన్స్ ఎవరికి దక్కెనో?

Nara Lokesh: ఆ పదవికి లోకేష్ గుడ్ బై? ఆ ఛాన్స్ ఎవరికి దక్కెనో?

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇక నుండి ఆ భాద్యతల నుండి తప్పుకోనున్నారు. ఔను మీరు చదివింది నిజమే.. ఇకపై ఆ భాధ్యతల నుండి తప్పుకొనేందుకు లోకేష్ ఇప్పటినుండే ప్లాన్ రెడీ చేసుకున్నారు. అంతేకాదు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడ లోకేష్ దారిలో నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో గల నారా లోకేష్ ఆ భాద్యతల నుండి తప్పుకొని, ఏ భాద్యత తీసుకుంటారో మున్ముందు తెలియనుంది.


మంత్రిగా నారా లోకేష్ తన శాఖపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణ పొందుతున్నారు. ఇటీవల అన్ని పాఠశాలల్లో పెద్ద పండుగ నిర్వహించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇలా మంత్రిగా తనకంటూ గుర్తింపు పొందిన లోకేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో లోకేష్ పాత్ర కీలకంగా చెప్పుకోవచ్చు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాదర్బార్ ద్వార ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అది కూడ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల ప్రజలు ప్రజా దర్బార్ కు తరలివచ్చి లోకేష్ కు వినతులు సమర్పిస్తున్నారు. ఓ వైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న లోకేష్ ఆ పదవికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సాక్షాత్తు లోకేష్ ప్రకటించారు.


యువతను రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు లోకేష్. పార్టీలో చురుకుగా ఉంటున్న వారికి ఈ భాద్యతలు అప్పజెప్పాలన్నది లోకేష్ మాట. ఓ వైపు రాష్ట్ర మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న లోకేష్, పార్టీ భాద్యతల నుండి తప్పుకోవాలని ఆలోచించడంతో పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. తన మాదిరిగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడ తన దారిలో నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేష్ అన్నారు.

Also Read: Maha Kumbh Mela: పుణ్యం కోసం వచ్చాడు.. పోలీసులకు చిక్కాడు!

దీనిని బట్టి పార్టీ కోసం కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ పార్టీలో ఏ పదవి తీసుకోనున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని లోకేష్ బదులిచ్చారు. విశాఖలో లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×