E-Paper
Advertisement

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
Advertisement

Adani Power Plant: కడపలో ఓ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కంపెనీకి సంబంధించిన పనులు అప్పగించలేదని, ఏకంగా కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

కడప జిల్లా కొండాపురం మండలంలోని రాగి కుంట ప్రాంతంలో 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది అదానీ సంస్థ. క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని చదును చేస్తున్నాయి అదానీ-రిత్విక్ సంస్థలు.

Advertisement

వాటి పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం, జెసీబీ అద్దాలు పగలగొట్టారు. తమ మాట వినకపోవడంతో ఆదానీ కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు.

ఎమ్మెల్యే బంధువులు శివ నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు పొద్దుటూరు పోలీసులు.

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×