E-Paper
Advertisement

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

Adani Power Plant: కడపలో ఓ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కంపెనీకి సంబంధించిన పనులు అప్పగించలేదని, ఏకంగా కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

కడప జిల్లా కొండాపురం మండలంలోని రాగి కుంట ప్రాంతంలో 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది అదానీ సంస్థ. క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని చదును చేస్తున్నాయి అదానీ-రిత్విక్ సంస్థలు.

వాటి పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం, జెసీబీ అద్దాలు పగలగొట్టారు. తమ మాట వినకపోవడంతో ఆదానీ కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు.

ఎమ్మెల్యే బంధువులు శివ నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు పొద్దుటూరు పోలీసులు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×