BigTV English
Advertisement

AP: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఏంటి?.. ఇక తాడో పేడో తేల్చుకుంటారా!?

AP: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఏంటి?.. ఇక తాడో పేడో తేల్చుకుంటారా!?

AP: అసెంబ్లీలో ఎమ్మెల్యేల కొట్లాట. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనూ గౌరవ సభ్యులు ఘర్షణకు దిగడంతో అంతా బిత్తరపోతున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్.. అసెంబ్లీలో పరస్పరం కొట్టుకునే వరకూ దారి తీయడాన్ని అంతా తప్పుబడుతున్నారు.


ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారనేది టీడీపీ ఆరోపణ. స్పీకర్‌ విధులకుకు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారని.. పక్కకు తప్పుకోండని అంటే తమపైనే దాడికి దిగారనేది వైసీపీ కౌంటర్.

సభలో జరిగింది ఏదైనా.. తప్పు ఎవరిదైనా.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకోవడం, తోసుకోవడం, కిందపడటం మాత్రం సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అందుకే, సభా సమరంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.


అసెంబ్లీలో జీవో నెంబర్ 1 రద్దు చేయాలని అడిగితే తమ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే పారిపోతామని అనుకుంటున్నారా? ఎదురుతిరుగుతాం.. తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందంటూ.. చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజు అన్నారు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీకి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని.. అందుకే మతిభ్రమించి తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దాడులు చేయమని సీఎం జగన్ వారిని ప్రోత్సహిస్తున్నారని.. ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే తమపై దాడి చేశారని.. తిరిగి తామే స్పీకర్‌పై దాడి చేసినట్టు మీడియా ముందు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.

అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైసీపీపై ఫైర్ అయ్యారు జనసేనాని. ఇదే పరిస్థితి కొనసాగితే ఇలాంటి దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్.

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×