E-Paper
Advertisement

Bosta vs Minister Kondapalli: ఏంటీ.. ఆ టీడీపీ మంత్రి బొత్స కాళ్లపై పడ్డారా..? వాస్తవం ఏంటి?

Bosta vs Minister Kondapalli: ఏంటీ.. ఆ టీడీపీ మంత్రి బొత్స కాళ్లపై పడ్డారా..? వాస్తవం ఏంటి?
Advertisement

Bosta vs Minister Kondapalli: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం కూటమి సర్కారులో అగ్గిరాజేస్తోంది. ఆయన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారని.. గత వారం రోజులుగా పొలిటికల్ వర్గాల్లో భారీగా ప్రచారం జరుగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాళ్లకు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. బొత్సను ఓడించిన సీనియర్ నేత.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి.. అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే.. బొత్సను గురువుగా చెబుతూ.. ఆయన కాళ్లకు మొక్కుతారా..? అని తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ.. ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించడానికే.. ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎయిర్ పోర్టులో తనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా కూటమి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.

Advertisement

Also Read: కడప రెడ్డెమ్మకు మంత్రి పదవి! మరో ముగ్గురి కథేంటి?

బొత్స సత్యనారాయణ ఎదురుపడగా సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా? అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తన తాత, బాబాయిలు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీపై పోటీ చేస్తూ, పోరాడుతూ వస్తున్నామన్నారు. అలాంటిది వారిని కాకా పట్టామనడం.. అసత్య ప్రచారమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కాళ్లకు దండాలు పెట్టాల్సిన అవసరం ఏముందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.

Advertisement

ఇదిలా ఉంటే.. సినీ ప్రముఖులపై మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ సీఎం జగన్‌ ను, ఇప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు సినిమా ప్రముఖులు వెళ్లి కలిశారని చెప్పారు. సినిమా రంగం వాళ్లు అవకాశ వాదులని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. సినిమాల బెనిఫిట్ షోలు కావాలని తాను చెప్పను..వద్దని చెప్పను.. ఏ నిర్ణయాన్ని కూడా తాను చెప్పనని బొత్స సత్యనారాయణ అన్నారు.

బొత్స కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలని అవకాశవాదులని అనడం పట్ల మండిపడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఎలా వేధించారో గుర్తు తెచ్చుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు. టికెట్‌ ధరల తగ్గింపు, హీరోలను అవమానించడం లాంటివి ఎన్నో చేశారని అంటున్నారు. మీలాగా పార్టీలు మారే అవకాశ వాదులం కాదని అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×