E-Paper
Advertisement

Montha Cyclone Alert: ఏపీపై మొంథా తుపాను పంజా.. తీరంలో రాకాసి అలలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

Montha Cyclone Alert: ఏపీపై మొంథా తుపాను పంజా.. తీరంలో రాకాసి అలలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
Advertisement

Montha Cyclone Alert: మొంథా తీవ్ర తుపానుగా మారింది. గంటకు 10 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్టుల్లో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ పోర్టుకు పదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 9వ నెంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో తుపాను కదిలింది. తుపాను ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కి.మీ, కాకినాడకి 190 కి.మీ, విశాఖపట్నానికి 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.

ఈదురుగాలుల విధ్వంసం

Advertisement

తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.

విశాఖలో నేల కూలిన భారీ వృక్షాలు

విశాఖలో మొంథా తుపాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు కైలాసగిరి సమీపంలో భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలుతున్నాయి. తుపాను ప్రభావంతో అంబాజీపేట మండలం వక్కలంక గ్రామంలో చెట్లు నేలకూలాయి.

ఉప్పాడ తీరంలో రాకాసి అలలు

Advertisement

ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ ప్రభావంతో రాకాసి అలలు తీరాన్ని తాకుతున్నాయి. రక్కసి అలల కారణంగా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రోడ్డు మార్గం ధ్వంసం అయింది.

విరిగిపడిన కొండచరియలు

విశాఖ జిల్లా గాజువాక-యారాడ సమీపంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు భారీగా విరిగి పడుతుండడంతో యారాడ నుంచి గంగవరం వస్తున్న బస్సులను కాసేపు నిలిపివేశారు.

Also Read: Severe Cyclone Montha: మొంథా తుపాను ఎఫెక్ట్.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈ రూట్లలో బస్సులు నిలిపివేత

జాతీయ రహదారులపై ఆంక్షలు

తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ముందే సురక్షిత లేబేలో వాహనాలను నిలుపుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×