E-Paper
Advertisement

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!

Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత తన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లారు. భీమవరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన మెడలో భారీ గజమాల వేసి అభిమానులు హంగామా చేశారు. ర్యాలీగా ఆయన భీమవరం చేరుకున్నారు.

రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకున్న ఆయనకు అభిమానులు, టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు.

ఇన్నాళ్లూ తనను ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి రాకుండా చేశారని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయిందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ పొత్తు విషయం తేలుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నానని తెలిపారు. టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×