BigTV English

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!

Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత తన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లారు. భీమవరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన మెడలో భారీ గజమాల వేసి అభిమానులు హంగామా చేశారు. ర్యాలీగా ఆయన భీమవరం చేరుకున్నారు.


రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకున్న ఆయనకు అభిమానులు, టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు.

ఇన్నాళ్లూ తనను ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి రాకుండా చేశారని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయిందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.


అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ పొత్తు విషయం తేలుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నానని తెలిపారు. టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.

Related News

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Ntr Baby Kit: ఏపీలో ఆ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రెండు వేలు, కొత్తగా ఆ రెండు

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Big Stories

×