E-Paper
Advertisement

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!

Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!
Advertisement

Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత తన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లారు. భీమవరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన మెడలో భారీ గజమాల వేసి అభిమానులు హంగామా చేశారు. ర్యాలీగా ఆయన భీమవరం చేరుకున్నారు.

రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకున్న ఆయనకు అభిమానులు, టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు.

Advertisement

ఇన్నాళ్లూ తనను ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి రాకుండా చేశారని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయిందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ పొత్తు విషయం తేలుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నానని తెలిపారు. టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.

Advertisement

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×