BigTV English
Advertisement

Mudragada : కాకినాడ, పిఠాపురం.. ఎనీ సెంటర్.. పోటీకి రెడీనా?

Mudragada : కాకినాడ, పిఠాపురం.. ఎనీ సెంటర్.. పోటీకి రెడీనా?

Mudragada Padmanabham latest news(AP politics): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖాస్త్రం సంధించారు. ఇటీవల పవన్ కు ముద్రగడ లేఖ రాయడంతో ..జనసైనికులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై ముద్రగడ మళ్లీ అదే రేంజ్ రీకౌంటర్ ఇచ్చారు. పవన్ తన ఫ్యాన్స్ తో బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విమర్శలకు లొంగిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పవన్ సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తాను జనసేనాని వద్ద నౌకరిగా పనిచేయడం లేదని.. తిట్టించాల్సిన అవసరం ఏంటి? అని ముద్రగడ నిలదీశారు.


ముద్రగడ తన లేఖలో పవన్ కు 12 ప్రశ్నలు సంధించారు. కాకినాడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సవాల్ చేశారు. ఒకవేళ అక్కడ పోటీకి భయపడితే.. పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. అక్కడ తాను బరిలోకి దిగుతానని స్పష్టంచేశారు. చేగువేరా ఆదర్శం, గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్పే పవన్ కల్యాణ్ పౌరుషం ఉందని భావిస్తున్నానని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు. గోచి మొలతాడు లేని వారితో తనను తిట్టిస్తున్నారని దమ్ముంటే పవనే తనపై విమర్శలు చేయాలన్నారు.

వంగవీటి హత్య, తుని ఘటన తర్వాత అమాయకులను జైలులో పెట్టారని ముద్రగడ అన్నారు. వారిని ఏనాడైనా పరామర్శించారా అని పవన్ ను ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారా? అని నిలదీశారు. ఇలా ముద్రగడ లేఖలు విడుదల చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా జనసేనాని సహనంతోనే వ్యవహరిస్తున్నారు. ముద్రగడపై కామెంట్స్ చేయడంలేదు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూనే వారాహి యాత్ర సాగిస్తున్నారు. ముద్రగడకు జనసైనికులే కౌంటర్ ఇస్తున్నారు. మరి రెండో లేఖపైనైనా పవన్ స్పందిస్తారా..? ముద్రగడ ప్రశ్నలకు సమాధానం చెబుతారా..? ఆయన విసిరి సవాల్ ను స్వీకరిస్తారా..?


Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×