BigTV English
Advertisement

Murder Attempt Case: వైసీపీకి చెందిన మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. బోరుగడ్డ అనిల్ పై కూడా..!

Murder Attempt Case: వైసీపీకి చెందిన మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. బోరుగడ్డ అనిల్ పై కూడా..!

Murder Attempt Case: ఆయన వైసీపీ మాజీ ఎంపీ. ఇప్పటికే మహిళ హత్యకేసులో రిమాండ్ లో ఉన్నారు. అయితే తాజాగా మరో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి పోలీసులు, ఆయనకు షాకిచ్చారనే చెప్పవచ్చు. ప్రస్తుత రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.


బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. వెలగపూడి మహిళా హత్యకేసులో రిమాండ్ లో ఉన్న నందిగం సురేష్ పై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. 2023 మార్చి 31న సత్య కుమార్ పై దాడి ఘటనలో ఏ1గా నందిగం సురేష్, ఏ2గా బోరుగడ్డ అనిల్ గా పేర్కొంటూ గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్, కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అలాగే బోరుగడ్డ అనిల్ గుంటూరు పోలీసుల కస్టడీలో ఉండగా, మరో కేసు ఆయనపై నమోదు కావడం విశేషం.

ఇప్పటి మంత్రి సత్యకుమార్, నాడు బీజేపీ నేతగా మూడు రాజధానుల శిబిరం దగ్గరకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఆ సమయంలో అప్పటి సీఎం జగన్ ను ఉద్దేశించి సత్యకుమార్ విమర్శించారు. అలాగే రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అప్పుడే పలువురు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడగా, కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ,  సత్యకుమార్ పై దాడికి యత్నించిన పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Also Read: TDP on Jagan Assets: జగన్ ఆస్తులపై మరో పొలిటికల్ బాంబ్.. అమ్మో అన్ని కోట్లా.. సమాధానం చెప్పాలంటున్న టీడీపీ

ప్రస్తుతం ఆ దాడికి సంబంధించి నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి టీడీపీ కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నట్లు వైసీపీ విమర్శిస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి చర్యలను ప్రజలు గమనిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలుపుతున్నారు.

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×