E-Paper
Advertisement

Nara Lokesh : తొలి రింగ్ లో 50 ప్రశ్నలు.. రెండోరోజు విచారణకు హాజరైన లోకేష్

Nara Lokesh : తొలి రింగ్ లో 50 ప్రశ్నలు.. రెండోరోజు విచారణకు హాజరైన లోకేష్
Advertisement

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు(Inner Ring Road Case)లో నారా లోకేష్‌ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేష్‌ను విచారించిన సీఐడీ అధికారులు..బుధవారం మరోసారి విచారణకు రావాలని అక్కడే నోటీసులు ఇచ్చారు. అయితే.. బుధవారం వివిధ పనుల్లో తాను బిజీగా ఉంటానని..ఏవైనా ప్రశ్నలుంటే ఎంత సమయమైనా..ఇప్పుడే అడగాలని సీఐడీ అధికారులకు చెప్పినట్లు లోకేష్‌ తెలిపారు. అయినప్పటికీ బుధవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని వెల్లడించారు.

అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్రమాలు జ‌రిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్ ను A14 గా చేర్చుతూ.. గత నెల 30న 41A కింద నోటీసులు జారీ చేస్తూ విచారణకు రావాలని పేర్కొంది సీఐడీ.

Advertisement

అయితే నిన్న సీఐడీ విచారణ నుంచి బయటకు వచ్చిన లోకేష్‌.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదన్నారు. విచారణలో సీఐడీ అధికారులు తనను 50 ప్రశ్నలు అడిగారని చెప్పుకొచ్చారు. లేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు విషయంలో తాను, తన కుటుంబసభ్యులు ఎలా లాభపడ్డారో ఒక్క ప్రశ్న కూడా వేయలేదని లోకేష్‌ పేర్కొన్నారు. ఇది కక్షసాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసని.. వైసీపీ ప్రభుత్వం దొంగ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోందని ఆరోపించారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×