E-Paper
Advertisement

Nara Lokesh: హీరో విజయ్ సినిమా సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్.. లోకేష్ ఎఫెక్ట్.. కర్నూల్ లో భిక్షాటన ముఠా?

Nara Lokesh: హీరో విజయ్ సినిమా సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్.. లోకేష్ ఎఫెక్ట్.. కర్నూల్ లో భిక్షాటన ముఠా?
Advertisement

Nara Lokesh: తమిళంలో తేరీ సినిమా చూసే ఉంటారు. అదే సినిమా తెలుగులో పోలీసోడు గా విడుదలై హిట్ కొట్టింది. ఆ సినిమాలో హీరో విజయ్, ఓ విలన్ ని చితకబాదుతాడు. ఆ విలన్.. చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తుంటే, హీరో ఒకరి కోసం వెళ్లి అందరి పిల్లల్ని రక్షిస్తాడు. అదే సీన్ కర్నూల్ లో సేమ్ టు సేమ్ జరిగింది. ఇక్కడ కూడా మంత్రి లోకేష్ ఆదేశాలతో ఒక్కరి కోసం వెళ్లిన అధికారులకు పదుల సంఖ్యలో చిన్నారులు దొరికారు.

ఒక్కరి కోసం వేట మొదలుపెడితే.. పెద్ద ముఠానే చిక్కింది కర్నూల్ లో. ఆ ముఠా భరతం పట్టేందుకు, అధికారులు పక్కా ప్లాన్ తో ప్రణాళిక రూపొందించారు. అసలేం జరిగింది? ఆ ముఠా ఎవరనుకుంటున్నారా.. అయితే తెలుసుకోండి.

Advertisement

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కూడా ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. కర్నూల్ నగరంలో ఓ ముఠా అదేపనిగా చిన్నారులకు రంగులు పూసి, భిక్షాటన చేయిస్తుందని అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. ఎండనక, వాననక రోడ్ల వెంట తిరుగుతున్నట్లు సదరు నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ వీడియోలో ఓ బాలుడు అలా కునుకు తీయడం, మళ్లీ భిక్షాటన సాగించిన దృశ్యాలు ఉండగా, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు.

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్న విషయాన్ని సమాజం మరచిపోయి, ఇటువంటి చేష్టలకు పాల్పడడం తగదని లోకేష్ కూడా రిప్లై ఇచ్చారు. అలాగే అసలు ఈ బాలుడు ఎవరు? ఇలా ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందో తెలుసుకొని, భాద్యులను శిక్షించాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులకు భారీ షాక్ తగిలింది. ఆ వీడియోలో ఉన్న బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించిన అధికారులు కర్నూల్ లో విస్తృతంగా పర్యటించారు. అలాగే బస్టాండ్స్, రైల్వే స్టేషన్ ల వద్ద తనిఖీలను సైతం నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీడియోలో ఉన్న బాలుడిని పోలినట్లుగానే, మరికొందరు బాలురు అలాగే రంగులు పూసుకొని భిక్షాటన సాగిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారించి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Shiva Swamy Baba: ఏలూరులో కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, రేపటి నుండి ప్రతి బాలుడు పాఠశాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారట. మంత్రి నారా లోకేష్ చేసిన ఒక్క ట్వీట్ తో కర్నూల్ అధికార యంత్రాంగం మొత్తం కదిలి, ఇలా చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వారి భరతం పట్టేందుకు ప్రణాళిక రూపొందించారట. దీనితో మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక చొరవకు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×