E-Paper
Advertisement

Yuvagalam Restart : నారా లోకేష్ “యువగళం”.. నేటి నుంచి పునః ప్రారంభం

Yuvagalam Restart : నారా లోకేష్ “యువగళం”.. నేటి నుంచి పునః ప్రారంభం
Nara lokesh yuvagalam latest update

Nara lokesh yuvagalam latest update(AP politics):

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో నిలిచిపోయిన యువగళం పాదయాత్ర తిరిగి నేటి నుంచి పునః ప్రారంభంకానుంది. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి నారా లోకేష్‌ యాత్రను ప్రారంభించనున్నారు . గతంలో ఎక్కడ నుంచి పాదయాత్రను నిలిపివేశారో.. అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

స్కిల్‌ స్కాంలో చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో దాదాపు 3 నెలల క్రితం లోకేష్‌ యువగళం పాదయాత్ర అర్థాతరంగా నిలిచిపోయింది. అయితే.. ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉండగా.. మధ్యలో గ్యాప్‌ వల్ల విశాఖలోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించడంతో.. అదే సెంటిమెంట్‌తో లోకేష్‌ కూడా అక్కడే ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ యాత్ర డిసెంబర్‌ చివరాఖరు వరకు కొసాగనుంది. పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుండటంతో తెలుగు తమ్ముళ్లు జోష్‌లో ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర కోసం ఇప్పటికే లోకేష్‌ రాజోలు క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భారీగా టీడీపీ శ్రేణులు తరలిరానున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ.. జగన్‌ వైఫల్యాలను ఎండగడుతూ సాగనుంది.

రోజుకు 15 కిలో మీటర్ల నుంచి 20 కిలో మీటర్ల మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ లోకేష్‌ ముందుకు సాగనున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి లోకేష్‌ యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. 208 రోజులపాటు యాత్ర సజావుగా సాగింది. యాత్రలో భాగంగా సెప్టెంబర్‌ 8న రాజోలులోకి అడుగుపెట్టిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో పొదలాడలో యాత్రను నిలిపివేశారు. తన తండ్రిని జైలు నుంచి బయటకు రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు తర్వాత.. ఎట్టకేలకు ఇటీవల చంద్రబాబుకు బెయిల్‌ లభించింది. దీంతో లోకేస్‌ తిరిగి ప్రజా క్షేత్రంలో నేటి నుంచి అడుగుపెట్టనున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×