E-Paper
Advertisement

Nara Lokesh: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Advertisement

Nara Lokesh On AP Special Status(AP political news): ఏపీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోకపోవడంతోనే 2018లో తన తండ్రి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని తెలిపారు.

62 ఏళ్లుగా అందరం కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా విభజనకు ముందు ఏపీ ఆర్థిక రాజధానిగా ఉండేదని అన్నారు. విభజన సమయంలో హామీలిచ్చిన కేంద్రాన్ని వాటిని అమలు చేయాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. 2014లో ఏపీ ప్రజల మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రం రెండుగా విభజించబడిందని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తామని అన్నారు.

Advertisement

Also Read: ఏపీలో ప్రముఖ న్యూస్ ఛానళ్ల ప్రసారాలు బంద్.. బ్లూ మీడియాకు బిగ్ షాక్ ?

ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తామని అన్నారు. అందుకు బదులుగా ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం సహకారాలను కోరుతామని అన్నారు. కేంద్రం నుంచి తమకు పూర్తి మద్దతు కావాలని అన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా.. రాష్ట్ర ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతన ఇస్తామని చెప్పారు.

Advertisement

 

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×