BigTV English

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..

Nara lokesh (AP political News) : మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్.. అందులో ఏముంది? జగన్ ఎందుకు భయపడు తున్నారు? పదేపదే జగన్ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏదో విధంగా అధికార ప్రభుత్వంపై బురద జల్లడానికేనా? టీడీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది? ఆయా ప్రశ్నలకు సమాధానం బయటకు వచ్చేసింది.


వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ రెడ్ బుక్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నా రు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పదేపదే దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి పెద్దగా కౌంటర్లు లేకపోవడంతో నేరుగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగేశారు. ఈ విషయంలో వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశారాయన.

శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతంలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలేది లేదని ప్రచారంలో చెప్పానన్నారు.


ALSO READ: మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

రెడ్ బుక్ విషయంలో ఊరూరూ వెళ్లి మాట్లాడనని వివరించారు. దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానన్నా రు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పనిలోపనిగా గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు. ముఖ్యంగా లిక్కర్, ఇసుక దందాలు కొనసాగాయని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని, ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి.. ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చేశారు.

ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజం అవుతుందని జగన్ భావిస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టామన్నారు. చివరకు అన్న క్యాంటీన్ల నిర్వహణకు వచ్చే విరాళాలపైనా ఆ పార్టీ ఏడుస్తోందని దుయ్యబట్టారు. సైకోల బారి నుంచి పేదలని రక్షించడానికే విరాళాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తానికి జగన్ చేసిన కామెంట్స్‌‌కు ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి నారా లోకేష్.

 

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×