BigTV English
Advertisement

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..

Nara lokesh: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..

Nara lokesh (AP political News) : మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్.. అందులో ఏముంది? జగన్ ఎందుకు భయపడు తున్నారు? పదేపదే జగన్ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏదో విధంగా అధికార ప్రభుత్వంపై బురద జల్లడానికేనా? టీడీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది? ఆయా ప్రశ్నలకు సమాధానం బయటకు వచ్చేసింది.


వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ రెడ్ బుక్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నా రు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పదేపదే దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి పెద్దగా కౌంటర్లు లేకపోవడంతో నేరుగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగేశారు. ఈ విషయంలో వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశారాయన.

శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతంలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలేది లేదని ప్రచారంలో చెప్పానన్నారు.


ALSO READ: మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

రెడ్ బుక్ విషయంలో ఊరూరూ వెళ్లి మాట్లాడనని వివరించారు. దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానన్నా రు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పనిలోపనిగా గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు. ముఖ్యంగా లిక్కర్, ఇసుక దందాలు కొనసాగాయని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని, ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి.. ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చేశారు.

ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజం అవుతుందని జగన్ భావిస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టామన్నారు. చివరకు అన్న క్యాంటీన్ల నిర్వహణకు వచ్చే విరాళాలపైనా ఆ పార్టీ ఏడుస్తోందని దుయ్యబట్టారు. సైకోల బారి నుంచి పేదలని రక్షించడానికే విరాళాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తానికి జగన్ చేసిన కామెంట్స్‌‌కు ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి నారా లోకేష్.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×