E-Paper
Advertisement

Nellore Crime News: కొడుకు చేసిన అత్యాచారానికి తల్లి సహకారం? నెల్లూరులో దారుణం.. అసలేం జరిగిందంటే?

Nellore Crime News: కొడుకు చేసిన అత్యాచారానికి తల్లి సహకారం? నెల్లూరులో దారుణం.. అసలేం జరిగిందంటే?
Advertisement

Nellore Crime News: ఓ తల్లి తన కొడుకుని అత్యాచారానికి ఉసిగొల్పిందని ఆరోపిస్తున్నారు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు. అసలు తల్లి కూడా ఓ మహిళే కదా.. అలా ఎందుకు చేసిందంటే.. ఇది నిజం అంటున్నారు వారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఏపీలోని నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెం గ్రామంలో..

నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెం గ్రామంలో ఓ విద్యార్థినిని యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఏకాంతంగా ఉన్న సమయంలో యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు, తమ కుమార్తె ఆ విషయాన్ని తెలుపగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు సైతం వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

కాగా బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తెకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్న భావనతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏడాదిగా తమ కుమార్తెను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమకు తెలిసిందని, యువకుడి యొక్క తల్లి సహకారంతోనే ఈ అత్యాచారం జరిగినట్లు తాను భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడిన యువకుడు, యువతి కుటుంబ సభ్యులకు దూరపు బంధువులుగా తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అయితే యువకుడి తల్లి పాత్ర ఉందంటూ, యువతి తండ్రి ఆరోపించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై యువకుడి అత్యాచార ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. అలాగే ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి తల్లి సహకారం ఉందంటూ సదరు బాలిక తండ్రి ఆరోపించడం విశేషం కాగా, ఇంతకు ఆమె పాత్ర ఈ ఘటనలో ఉందా లేదా అన్నది పోలీసుల దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది.

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×