E-Paper
Advertisement

Road Accident in Nellore: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు, బస్సు ఢీ.. ఏడుగురు మృతి

Road Accident in Nellore: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు, బస్సు ఢీ.. ఏడుగురు మృతి
Road Accident in Nellore

Road Accident In Nellore(AP news today telugu): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, ఓ బస్సు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 15 మందికి పైగా గాయపడ్డారు. జిల్లాలోని కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ముందుగా ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వస్తోన్న మరో లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టడతంతో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారని తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే.. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మృతులు, క్షతగాత్రుల బంధువులు 9440796383 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×