BigTV English
Advertisement

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్‌లో మా మద్దతు ఆ పార్టీకే.. ఓవైసీ సంచలన నిర్ణయం.. గెలుపు ఆ పార్టీదే..?

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్‌లో మా మద్దతు ఆ పార్టీకే.. ఓవైసీ సంచలన నిర్ణయం.. గెలుపు ఆ పార్టీదే..?

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఎమ్ఐఎమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బస్తీలు గత పది ఏళ్లలో పూర్తిగా వెనుకబడ్డాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల పాటు కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అని వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు.


15 శాతానికి పడిపోయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్

గత అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓటు షేర్ ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీకి ఓట్ షేర్ ఎందుకు షిఫ్ట్ అయిందా అని చర్చిస్తున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదని అన్నారు. ‘పార్లమెంట్ లో కేవలం 23 మంది ముస్లిం ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశంలో అన్ని కులాలకు ఒక్కో పార్టీ ఉంది. మరి ముస్లింల కోసం మాట్లాడడం తప్పా..?’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.


ALSO READ: Telangana politics: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ఉక్కిరిబిక్కిరి, బైపోల్‌లో బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా?

సీఎం రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు..

‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి చేద్దాం. కలిసి రావాలని కోరితే కలిసి పనిచేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాగా బీఆర్ఎస్ ఆలోచించలేదు. ఓల్డ్ సిటీకి మెట్రో బీఆర్ఎస్ హయాంలో చేయలేదు. కేటీఆర్ కు అవగాహన ఉన్నట్టు లేదు. అంతా అయిపోయాక దొంగ ఓట్లు అని చెప్పడం ఏంటి..? ఈ ఓట్లు అన్నీ పాతవే.. ఓటర్ లిస్ట్ వచ్చాక ఏం చేశారు..? ఎన్నికల్లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదు.. అభివృద్ధి చేయకుండా.. సెంటిమెంట్ తో ఓట్లు అడగడం ఏంటి..?’ అని నిలదీశారు.

ALSO READ: Visakhapatnam AI Hub: 5 ఏళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

పోటీ చేయాలా..? వద్దా?:  రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం..

ఎమ్ఐఎమ్ అంటే ఒక ముస్లింలకే పరిమితం కాదు. జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలా..? వద్దా..? అని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడతారు. జూబ్లీహిల్స్ బస్తీలు గత పది ఏళ్లలో పూర్తిగా వెనుకబడ్డాయని అన్నారు. పదేళ్ల పాటు కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అని ఆరోపణలు చేశారు. నియోజక వర్గంలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు.

Related News

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Andesri Cremation: ఘట్‌కేసర్‌లో కవి అందెశ్రీ అంత్యక్రియలు.. పాడి మోసిన సీఎం రేవంత్‌రెడ్డి

Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 31.94 శాతం.. నాన్ లోకల్స్ నేతల హంగామా, ఆపై కేసులు

Train Ticket Regret Sankranti-2026: ప్రయాణికులకు సంక్రాంతి టెన్షన్.. బుకింగ్ ఓపెనైన ఐదు నిమిషాలకే వెయిటింగ్ లిస్టు

Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Jubilee Hills polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రచ్చ

Jubilee Hills By Poll: జోరుగా జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు..

Big Stories

×