E-Paper
Advertisement

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్
Advertisement

Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Advertisement

ఏపీ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వలసల ప్రాంతంగా పేరు పొందిన ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో బూస్ట్ లభించిన ట్టయ్యింది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం తొలి విమానం సేఫ్‌‌గా ల్యాండ్ అయ్యింది.  టెర్మినల్ దగ్గరలో ల్యాండైంది ఎయిరిండియా విమానం. అనుకున్న సమయానికి విమానం వచ్చింది.

Advertisement

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్, పలువురు సివిల్ ఏవియేషన్ అధికారులు అందులో వచ్చారు. అందుకుముందు విమానం ల్యాండింగ్‌కు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్‌పోర్టుని నిర్మించింది జీఎంఆర్ సంస్థ.  ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సాంకేతిక అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు రాక 

హుద్‌హుద్ వంటి తుపాన్లను తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు అధికారులు. గతంలో ఇచ్చిన గడువు కంటే ఆరునెలలు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు, పర్యాటక రంగం మరింత ఊపందుకోనుంది.

విమానం ల్యాండింగ్ సేఫ్‌‌గా జరగడంతో ఎప్పుడు ఎయిర్‌పోర్టుని ప్రారంభించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ ప్రకారం జూన్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేవలం ఐదు శాతం మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే ఐదు నెలల్లో అవన్నీ పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. 2,200 ఎకరాల్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. రోజుకు 200 నుంచి 300 విమానాలు  ల్యాండింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ: అనకాపల్లి జిల్లా ఎస్వీఎస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయిన ఘట్టాన్ని చూసేందుకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, అదితి గజపతిరాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, విజనయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్‌రెడ్డి హాజరయ్యారు.

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×