E-Paper
Advertisement

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్
Advertisement

Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Advertisement

ఏపీ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వలసల ప్రాంతంగా పేరు పొందిన ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో బూస్ట్ లభించిన ట్టయ్యింది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం తొలి విమానం సేఫ్‌‌గా ల్యాండ్ అయ్యింది.  టెర్మినల్ దగ్గరలో ల్యాండైంది ఎయిరిండియా విమానం. అనుకున్న సమయానికి విమానం వచ్చింది.

Advertisement

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్, పలువురు సివిల్ ఏవియేషన్ అధికారులు అందులో వచ్చారు. అందుకుముందు విమానం ల్యాండింగ్‌కు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్‌పోర్టుని నిర్మించింది జీఎంఆర్ సంస్థ.  ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సాంకేతిక అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు రాక 

హుద్‌హుద్ వంటి తుపాన్లను తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు అధికారులు. గతంలో ఇచ్చిన గడువు కంటే ఆరునెలలు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు, పర్యాటక రంగం మరింత ఊపందుకోనుంది.

విమానం ల్యాండింగ్ సేఫ్‌‌గా జరగడంతో ఎప్పుడు ఎయిర్‌పోర్టుని ప్రారంభించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ ప్రకారం జూన్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేవలం ఐదు శాతం మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే ఐదు నెలల్లో అవన్నీ పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. 2,200 ఎకరాల్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. రోజుకు 200 నుంచి 300 విమానాలు  ల్యాండింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ: అనకాపల్లి జిల్లా ఎస్వీఎస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయిన ఘట్టాన్ని చూసేందుకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, అదితి గజపతిరాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, విజనయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్‌రెడ్డి హాజరయ్యారు.

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×