E-Paper
Advertisement

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది
Advertisement

పేకాట అంటే ఒక జూదం. సరదాగా ఆడుకుంటే పర్వాలేదు. కానీ, పందాలు కడితేనే అసలైన సమస్య. డబ్బులు పెట్టకుండా పేకాడితే కిక్కేం ఉంటుంది అనేది పేకాట క్రీడాకారుల అభిప్రాయం. వీళ్లను ఇలా వదిలేస్తే.. పేకాటను కూడా ఒలింపిక్స్‌లో పెట్టి ప్రోత్సహించాలని కోరతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పేకాట క్లబ్బులు పేకాటకు అనుమతించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. షాకింగ్ తీర్పు ఇచ్చింది.

13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వండి ప్లీజ్

పేకాటకు అనుమతి లేదని తెలిసినా.. చాలామంది గుట్టుచప్పుడు కాకుండా పందాలు కాసేస్తున్నారు. అలాంటి ప్రభుత్వం దానికి అనుమతి ఇస్తే ఇంకేమైనా ఉందా? చెలరేగిపోరు. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్లకు షాకిచ్చే తీర్పు ఇచ్చింది. ఏపీకి చెందిన బీమవరం కాస్మోపాలిటన్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్, నర్సాపురం యూత్ క్లబ్బులు హైకోర్టును ఆశ్రయించాయి. తమ క్లబ్‌కు వచ్చే కస్టమర్లు 13 కార్డ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. దీనిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని పరోక్షంగా విన్నించుకున్నారు. ఒక వేళ వీరికి అనుమతి ఇస్తే.. పేకాటకు నేరుగా సపోర్ట్ చేసినట్లేనని హైకోర్టు భావించిందో ఏమో. అలా అస్సలు కుదరదని చెప్పేసింది.

డబ్బులు పెట్టి పేకాటా? నో.. నో…

Advertisement

డబ్బులు పెట్టి పేకాట ఆడితే కస్టమర్లకు కిక్ రావచ్చేమో. కానీ, పోలీసులకు మాత్రం కొత్త తలనొప్పులు వస్తాయి. కోర్టు అనుమతి ఇస్తే.. అది కేవలం ఆ మూడు క్లబ్‌లకు మాత్రమే వర్తించదు. వారి వెంట మరికొందరు కూడా వస్తారు. తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. అంతేకాదు.. డబ్బులు పెట్టి పేకాట ఆడటం వల్ల కొంపలు కొల్లేరు అవుతాయి. డబ్బులన్నీ అందులోనే పెట్టి రోడ్డున పడే ఛాన్సులు ఉన్నాయి. అందుకే, కోర్టు ముందు చూపుగా.. అలాంటివి కుదరదని చెప్పేసింది. ఈ క్లబ్‌లు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల కోసం కోర్టును ఆశ్రయించవద్దు అనేలా చురకలు అంటించింది. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో కోళ్ల పందాలే కాదు.. పేకాట పందేలు కూడా జోరుగా సాగుతాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని అంటున్నారు జనాలు.

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారా?

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×