E-Paper
Advertisement

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది

Gambling: పేకాట కోసం ఏకంగా న్యాయస్థానానికి.. ఏపీ హైకోర్టు భలే షాకిచ్చింది

పేకాట అంటే ఒక జూదం. సరదాగా ఆడుకుంటే పర్వాలేదు. కానీ, పందాలు కడితేనే అసలైన సమస్య. డబ్బులు పెట్టకుండా పేకాడితే కిక్కేం ఉంటుంది అనేది పేకాట క్రీడాకారుల అభిప్రాయం. వీళ్లను ఇలా వదిలేస్తే.. పేకాటను కూడా ఒలింపిక్స్‌లో పెట్టి ప్రోత్సహించాలని కోరతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పేకాట క్లబ్బులు పేకాటకు అనుమతించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. షాకింగ్ తీర్పు ఇచ్చింది.

13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వండి ప్లీజ్

పేకాటకు అనుమతి లేదని తెలిసినా.. చాలామంది గుట్టుచప్పుడు కాకుండా పందాలు కాసేస్తున్నారు. అలాంటి ప్రభుత్వం దానికి అనుమతి ఇస్తే ఇంకేమైనా ఉందా? చెలరేగిపోరు. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్లకు షాకిచ్చే తీర్పు ఇచ్చింది. ఏపీకి చెందిన బీమవరం కాస్మోపాలిటన్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్, నర్సాపురం యూత్ క్లబ్బులు హైకోర్టును ఆశ్రయించాయి. తమ క్లబ్‌కు వచ్చే కస్టమర్లు 13 కార్డ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. దీనిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని పరోక్షంగా విన్నించుకున్నారు. ఒక వేళ వీరికి అనుమతి ఇస్తే.. పేకాటకు నేరుగా సపోర్ట్ చేసినట్లేనని హైకోర్టు భావించిందో ఏమో. అలా అస్సలు కుదరదని చెప్పేసింది.

డబ్బులు పెట్టి పేకాటా? నో.. నో…

డబ్బులు పెట్టి పేకాట ఆడితే కస్టమర్లకు కిక్ రావచ్చేమో. కానీ, పోలీసులకు మాత్రం కొత్త తలనొప్పులు వస్తాయి. కోర్టు అనుమతి ఇస్తే.. అది కేవలం ఆ మూడు క్లబ్‌లకు మాత్రమే వర్తించదు. వారి వెంట మరికొందరు కూడా వస్తారు. తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. అంతేకాదు.. డబ్బులు పెట్టి పేకాట ఆడటం వల్ల కొంపలు కొల్లేరు అవుతాయి. డబ్బులన్నీ అందులోనే పెట్టి రోడ్డున పడే ఛాన్సులు ఉన్నాయి. అందుకే, కోర్టు ముందు చూపుగా.. అలాంటివి కుదరదని చెప్పేసింది. ఈ క్లబ్‌లు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల కోసం కోర్టును ఆశ్రయించవద్దు అనేలా చురకలు అంటించింది. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో కోళ్ల పందాలే కాదు.. పేకాట పందేలు కూడా జోరుగా సాగుతాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని అంటున్నారు జనాలు.

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారా?

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×