E-Paper
Advertisement

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

NRI TDP Leader Mannam Venkataramana Died : టిడిపి నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ (53) గుండెపోటుతో మరణించారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ కు వస్తుండగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గ్రీస్ ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా..వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 53 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

Read More : చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన ఏపీ కాంగ్రెస్‌.. ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత

ఆ తర్వాత అమెరికాలోని వివిధ జాతీయస్థాయి తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లోనూ ఆయన యాక్టివ్ గా పనిచేసేవారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన వారికి న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి.. తన ఉదారతను, గొప్ప మనసును చాటుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

న్యూజెర్సీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆయన గుండెపోటుకు గురవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు తెలిపారు. వెంకటరమణ మృతితో టిడిపిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×