E-Paper
Advertisement

Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

Palnadu District: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకున్న  ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక ధాన్యం వ్యాపారి భార్య అయిన జ్యోతి.. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

పిడుగురాళ్లకు చెందిన ఓ ధాన్యం వ్యాపారి భార్య జ్యోతిని..  పిడుగురాళ్ల సీఐ వెంకటరావు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తమపై ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ..  పోలీసులు అనవసరంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే పోలీసులు తనను బలవంతంగా స్టేషన్‌కు తీసుకువెళ్లారని..  అక్కడ తనను సెల్‌లో వేసేందుకు ప్రయత్నించారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా పిడుగురాళ్ల సీఐతో పాటు టీడీపీ నాయకులు కలిసి సివిల్ సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నారని.. తన భర్తను పోలీస్ స్టేషన్‌లో బంధించి.. సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను బలవతంగా తమకు రాయించుకున్నారని జ్యోతి  ఆరోపించారు.

సీఐ ప్రవర్తన,  పోలీసుల వేధింపులు భరించలేకపోయిన జ్యోతి..  తీవ్ర మనస్తాపానికి గురైంది. స్టేషన్ లోపలే తన వెంట ఉన్న కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రక్తం ఓడుతున్న స్థితిలో ఆమెను చూసిన సిబ్బంది వెంటనే స్పందించి..  చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ‘మేము ఏ తప్పూ చేయలేదు..  మాపై ఎలాంటి కేసులు లేవు.. మరి మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు’ అంటూ ఆమె అధికారులను ప్రశ్నించింది.

ఈ ఘటనపై ప్రజల నుండి, బాధితురాలి బంధువుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలీసుల వైఫల్యం బయటపడుతుందనే భయంతో..  ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఎవరికీ కనిపించకుండా పోలీసులు దాచిపెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఉదంతం జిల్లా పోలీసు యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని..  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Mahabubnagar: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×