BigTV English
Advertisement

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Paritala Case : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్యే కేసులో ప్రధాన దోషి మలిశెట్టి భాను కిరణ్.. అలియాస్ భానుకు బెయిల్ మంజూరైంది. 2011లో సూరి హత్యకు గురికాగా.. 2018లో భానును నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కింద.. భాను నేరానికి పాల్పడ్డాడు అని తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో.. 12 ఏళ్లుగా భాను చంచల్ గూఢ జైలులోనే ఉంటున్నాడు. కాగా.. ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు.


సూరి హత్య కేసులో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న భాను కిరణ్.. సుప్రీం కోర్టులో అపీల్ చేశాడు. దీనిపై విచారించిన సుప్రీం.. స్థానిక కోర్టులో తేల్చుకొమని ఆదేశించింది. దాంతో.. మళ్లీ స్థానిక కోర్టును ఆశ్రయించగా, ఈ నెల 11న విచారణ జరగనుంది.

భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు.. అతని ప్రైవేటు గన్‌మన్‌ మన్మోహన్‌సింగ్‌ బదౌరియాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్‌ 307 కింద యావజ్జీవ శిక్షతో పాటు, నిషేధిత ఆయుధాలను వినియోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.


మద్దెలచెర్వు సూరిని2011 జనవరి 3న తన ప్రధాన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ హత్య చేశాడు. సూరితో పాటు కారులో ప్రయాణిస్తూ.. యూసఫ్‌గూడ దగ్గరకు రాగానే.. తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పారిపోయాడు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ.. సూరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, అంతర్గత శతృత్వమే హత్యకు ప్రధాన కారణంగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది

Related News

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Big Stories

×