E-Paper
Advertisement

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట
Advertisement

Paritala Case : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్యే కేసులో ప్రధాన దోషి మలిశెట్టి భాను కిరణ్.. అలియాస్ భానుకు బెయిల్ మంజూరైంది. 2011లో సూరి హత్యకు గురికాగా.. 2018లో భానును నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కింద.. భాను నేరానికి పాల్పడ్డాడు అని తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో.. 12 ఏళ్లుగా భాను చంచల్ గూఢ జైలులోనే ఉంటున్నాడు. కాగా.. ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు.

సూరి హత్య కేసులో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న భాను కిరణ్.. సుప్రీం కోర్టులో అపీల్ చేశాడు. దీనిపై విచారించిన సుప్రీం.. స్థానిక కోర్టులో తేల్చుకొమని ఆదేశించింది. దాంతో.. మళ్లీ స్థానిక కోర్టును ఆశ్రయించగా, ఈ నెల 11న విచారణ జరగనుంది.

Advertisement

భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు.. అతని ప్రైవేటు గన్‌మన్‌ మన్మోహన్‌సింగ్‌ బదౌరియాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్‌ 307 కింద యావజ్జీవ శిక్షతో పాటు, నిషేధిత ఆయుధాలను వినియోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.

మద్దెలచెర్వు సూరిని2011 జనవరి 3న తన ప్రధాన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ హత్య చేశాడు. సూరితో పాటు కారులో ప్రయాణిస్తూ.. యూసఫ్‌గూడ దగ్గరకు రాగానే.. తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పారిపోయాడు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ.. సూరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, అంతర్గత శతృత్వమే హత్యకు ప్రధాన కారణంగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×