E-Paper
Advertisement

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..
Advertisement
pawan vishaka

Pawan Kalyan: విశాఖలో వైసీపీ అక్రమాల భరతం పడుతున్నారు పవన్ కల్యాణ్. శుక్రవారం రుషికొండకు వెళ్లి సర్కారు తీరుపై విరుచుకుపడితే.. శనివారం సిరిపురం వెళ్లి ఎంపీ ఎంవీవీ కబ్జాలపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారంటూ జనసేనాని ఫైర్ అయ్యారు.

సిరిపురం CBCNC భూములపై.. 18 క్రైస్తవ సంఘాలకు చెందిన భూములు వివాదంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే 1800 గజాల స్థలాన్ని తీసుకుని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ.. దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సంస్థ నిర్మించే భవనాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారని.. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితోనే.. ఎంపీ చేతులు కలిపి దందాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ.. విశాఖ నుంచి ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు పవన్ కల్యాణ్.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×