BigTV English
Advertisement

Tirumala tiger attack news : చిరుతదాడిపై చంద్రబాబు రియాక్షన్.. కోవూరు ఎమ్మెల్యే కాంట్రవర్సీ స్టేట్‌మెంట్..

Tirumala tiger attack news : చిరుతదాడిపై చంద్రబాబు రియాక్షన్.. కోవూరు ఎమ్మెల్యే కాంట్రవర్సీ స్టేట్‌మెంట్..
Tirumala tiger attack news


Tirumala latest news today(Latest telugu news in AP) : తిరుమల కాలిబాటలో చిరుతదాడి చేసి చిన్నారిని చంపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ వైఖరి వల్లే చిన్నారి చనిపోయిందనే ఆక్రోశం లక్షిత స్వగ్రామంలో వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంలో లక్షితను కడసారి చూసేందుకు ఊరు ఊరంతా కదిలొచ్చింది. కన్నీరు పెట్టింది. ఈ మరణానికి నూటికి నూరు శాతం టీటీడీదే బాధ్యత అని మండిపడుతున్నారు. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసినప్పుడే.. అధికారులు తగు రక్షణ చర్యలు తీసుకుని ఉండుంటే.. ఇప్పుడిలా నిండుప్రాణం క్రూరమృగానికి బలి కాకపోయేదిగా అని ప్రశ్నిస్తున్నారు.

అంతా టీటీడీపై విరుచుకుపడితే.. చిన్నారి లక్షిత మృతిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాప తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. లక్షిత తల్లిదండ్రులను విచారించాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.


ఇక, లక్షిత మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే ఓ బాలుడు మృతి చెందాడని.. అప్పటి నుంచి టీటీడీ రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. పాప తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టి భక్తుల్లో ఉన్న భయాలను తొలగించాలని కోరారు చంద్రబాబు.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×