BigTV English

Pawan Kalyan : యాక్షన్ తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

Pawan Kalyan : యాక్షన్ తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

Pawan Kalyan news live(Breaking news in Andhra Pradesh): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని కలిశారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు జనసేనాని చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.


ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి చెంపలపై సీఐ అంజూ యాదవ్‌ కొట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. కొట్టే సాయిని సీఐ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే పవన్ కల్యాణ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసైనికుడు సాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ సీఐపై ఫిర్యాదు చేశారు.


జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్‌ చేయి చేసుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్‌ అయ్యారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులు డీఐజీకి పంపారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించారు. అలాగే అంజూ యాదవ్‌కు చార్జ్‌ మెమో జారీ చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×