E-Paper
Advertisement

Pawan Kalyan : యాక్షన్ తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

Pawan Kalyan : యాక్షన్ తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

Pawan Kalyan news live(Breaking news in Andhra Pradesh): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని కలిశారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు జనసేనాని చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి చెంపలపై సీఐ అంజూ యాదవ్‌ కొట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. కొట్టే సాయిని సీఐ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే పవన్ కల్యాణ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసైనికుడు సాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ సీఐపై ఫిర్యాదు చేశారు.

జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్‌ చేయి చేసుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్‌ అయ్యారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులు డీఐజీకి పంపారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించారు. అలాగే అంజూ యాదవ్‌కు చార్జ్‌ మెమో జారీ చేశారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×