E-Paper
Advertisement

Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం

Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం
Advertisement

Pawan Kalyan: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

గతంలో రాజోలు పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి రైతులు డ్రెయిన్ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల కష్టాలను చూసి చలించిన ఆయన, 45 రోజుల్లోగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం, గడువు కంటే ముందే.. అంటే కేవలం 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరై పనులు ప్రారంభం కావడంతో కోనసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.

Read Also: Vijayawada News: అరెస్టు భయం.. అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ, మళ్లీ ఏమైంది?

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×