BigTV English
Advertisement

Pawan Kalyan: వన్ నేషన్.. వన్ వుడ్.‌‌. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్

Pawan Kalyan: వన్ నేషన్.. వన్ వుడ్.‌‌. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్

Pawan Kalyan: గేమ్ ఛేంజర్ జర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. రాజమండ్రిలో జరుగుతున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 10న విడుదల కానున్న సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ రంగాన్ని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ స్థాయి అంటూ హీరోల స్థాయిని వేర్వేరుగా ప్రచారం సాగించడం తగదన్నారు. సినిమా రంగమనేది కళాకారులకు పుట్టినిల్లుగా వర్ణించిన పవన్ కళ్యాణ్, వేర్వేరు స్థాయిలో నటులను కీర్తించడం తగదన్నారు. 1990 వరకు కేవలం సినిమాను సినిమాగా చూసే వారని, ఆ తర్వాత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లు తెరపైకి వచ్చాయన్నారు.

ఇదే విషయంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరో కీలక కామెంట్ చేశారు. సినిమా రంగం అనేది అంతా ఒకటేనన్న కనిపించాలని, దేశం మొత్తం ఒకటే సినిమా రంగమనే భావన ఉండాలన్నారు. పవన్ కామెంట్స్ ను బట్టి, వన్ నేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది.


Also Read: Game Changer Pre -Release Event : పవన్ స్పీచ్..అన్న పై ప్రశంసలు.. అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కౌంటర్..

తాజాగా పవన్ కూడ వన్ నేషన్ వన్ సినిమా వన్ వుడ్ అనే తరహాలో యావత్ సినిమా ప్రపంచాన్ని ఏకం చేసేలా మాట్లాడారు. ఇటీవల పలువురు హీరోలు నటించిన సినిమాలను హాలీవుడ్ రేంజ్, బాలీవుడ్ రేంజ్ అంటూ అభిమానులు ప్రచారం సాగించిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇటువంటి ప్రచారంతో సినిమా రంగానికి కాస్త తలనొప్పులు అధికమవుతాయన్న తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఏ దృష్టితో చేశారో కానీ, ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×