E-Paper
Advertisement

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..
pawan kalyan speech

Pawan Kalyan Speech latest(AP politics): హిందూధర్మం అంటే తమాషాగా ఉందా.. హిందూధర్మం జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. అన్నవరం ఆలయంలో పురోహితులను వేలం వేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. జగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు పవన్. 

దేవాలయాల్లోని పురోహితులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు జనసేనాని. ఇదే పనిని ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో చేయగలరా? అని నిలదీశారు. మత విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం తగదన్నారు. పురోహితుల వేలంపై జనసేన తరఫున కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.

ధరల పెరుగుదల, మద్యం ధరల పెంపు, చెత్త పన్ను, ఇసుక మైనింగ్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పీఎఫ్‌ పక్కదారి పట్టించడం.. ఇలా జగన్ డిజిటల్ దొంగలా మారారని.. జగన్ జగ్గూ భాయ్ అయ్యారని మండిపడ్డారు పవన్.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ మార్చేశారని.. నవరత్నాలు అందులోనుంచే పుట్టుకొచ్చాయని.. ఈ పథకాలు జగన్‌కు ముందు కూడా ఉన్నాయని వివరించారు జనసేనాని.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×