BigTV English

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..
pawan kalyan speech

Pawan Kalyan Speech latest(AP politics): హిందూధర్మం అంటే తమాషాగా ఉందా.. హిందూధర్మం జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. అన్నవరం ఆలయంలో పురోహితులను వేలం వేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. జగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు పవన్. 


దేవాలయాల్లోని పురోహితులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు జనసేనాని. ఇదే పనిని ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో చేయగలరా? అని నిలదీశారు. మత విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం తగదన్నారు. పురోహితుల వేలంపై జనసేన తరఫున కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.

ధరల పెరుగుదల, మద్యం ధరల పెంపు, చెత్త పన్ను, ఇసుక మైనింగ్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పీఎఫ్‌ పక్కదారి పట్టించడం.. ఇలా జగన్ డిజిటల్ దొంగలా మారారని.. జగన్ జగ్గూ భాయ్ అయ్యారని మండిపడ్డారు పవన్.


కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ మార్చేశారని.. నవరత్నాలు అందులోనుంచే పుట్టుకొచ్చాయని.. ఈ పథకాలు జగన్‌కు ముందు కూడా ఉన్నాయని వివరించారు జనసేనాని.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×