E-Paper
Advertisement

స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

Pawan Kalyan: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎలాంటి వైద్యం అందుతోంది అనే వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదం అసలు ఏ విధంగా జరిగిందనే అంశంపై అధికారులతో మాట్లాడారు.

బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన, అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..  ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.

ఆసుపత్రిలో పరామర్శ అనంతరం, ఆయన నేరుగా స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఆయన ప్రమాద స్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Also Read: నల్లగొండలో దారుణం.. కొడుకుని చంపి, తండ్రి ఆత్మహత్య

Related News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ.కోటి ఇవ్వాల్సిందే.. లేదంటే ఉద్యమమే.. కేఏ పాల్ హెచ్చరిక!

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో కొత్త విషయాలు..కార్మికులపై 1500 డిగ్రీల వేడి మెటల్, కేంద్రమంత్రి ఎక్స్ గ్రేషియా

తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్‌చల్!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి!

Big Stories

×