E-Paper
Advertisement

స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!
Advertisement

Pawan Kalyan: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎలాంటి వైద్యం అందుతోంది అనే వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదం అసలు ఏ విధంగా జరిగిందనే అంశంపై అధికారులతో మాట్లాడారు.

బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన, అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..  ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.

ఆసుపత్రిలో పరామర్శ అనంతరం, ఆయన నేరుగా స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఆయన ప్రమాద స్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Also Read: నల్లగొండలో దారుణం.. కొడుకుని చంపి, తండ్రి ఆత్మహత్య

Related News

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

Big Stories

Advertisement
×