E-Paper

నల్లగొండలో దారుణం.. కొడుకుని చంపి, తండ్రి ఆత్మహత్య!

నల్లగొండలో దారుణం.. కొడుకుని చంపి, తండ్రి ఆత్మహత్య!

Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కనకదుర్గ కాలనీలో నివాసముంటున్న పబ్బతి లింగారెడ్డి (45) అనే వ్యక్తి, క్షణికావేశంలో తన 13 ఏళ్ల కుమారుడు ప్రణీత్ రెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడి తలపై సుత్తితో బలంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత తీవ్రమైన పశ్చాత్తాపం లేదా భయంతో లింగారెడ్డి సైతం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న తండ్రీకొడుకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘాతుకానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ.కోటి ఇవ్వాల్సిందే.. లేదంటే ఉద్యమమే.. కేఏ పాల్ హెచ్చరిక!

Related News

BMW కారు, 33 తులాల బంగారం, 25 మంది భార్యలు.. ఒకే ఒక్క ఫిర్యాదుతో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!

కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు దుర్మరణం!

నేపాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, ఎనిమిది మంది మృతి!

ఖాకీకే గురి.. పట్టపగలే రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చైన్ స్నాచింగ్!

మియాపూర్‌లో విషాదం.. చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళ

×