E-Paper
Advertisement

నిద్ర‌పోయిన అంపైర్లు…ప్రియాంష్ ఆర్య ర‌నౌట్ పై వివాదం, బ‌తికిపోయిన రుతురాజ్

నిద్ర‌పోయిన అంపైర్లు…ప్రియాంష్ ఆర్య ర‌నౌట్ పై వివాదం, బ‌తికిపోయిన రుతురాజ్

Priyansh Arya Run Out Controversy:  టీమిండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ A జట్ల మధ్య ప్రస్తుతం వన్డే ట్రై సిరీస్ ( Tri Nation A Series in Sri Lanka 2026 ) జరుగుతోంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ఇవాళ తొలి మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక A జట్ల ( Sri Lanka A vs India A ) మధ్య ప్రారంభమైంది. ఇందులో టీమిండియా A జట్టు మొదట బ్యాటింగ్ చేయగా, 277 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ప్రియాంష్ ఆర్య రనౌట్ వివాదంగా మారింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) చేసిన తప్పిదం కారణంగా… ప్రియాంష్ ఆర్య రనౌట్ (Priyansh Arya Run Out Controversy) కావాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంపైర్ తప్పిదం వల్ల అనవసరంగా ప్రియాంష్ ఆర్య బ‌లి అయ్యాడని సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

ప్రియాంష్ ఆర్య ర‌నౌట్ పై వివాదం, బ‌తికిపోయిన రుతురాజ్

వన్డే ట్రై సిరీస్ లో భాగంగా తాజాగా టీమిండియా వర్సెస్ శ్రీలంక A జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరుగుతోంది. ఈ సందర్భంగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే షాట్ ఆడాడు. ఈ క్రమంలో రెండవ పరుగు కోసం అత్యాశ పడ్డాడు రుతురాజ్. అయితే మరో ఎండ్ వైపు ఉన్న ప్రియాంష్ ఆర్యను చూసుకోకుండానే… రెండో పరుగు కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఎండ్ వైపు ఇద్దరు బ్యాటర్లు వెళ్లిపోయారు. అయితే ప్రియాంష్ ఆర్య కంటే ముందు రుతురాజ్ క్రీజులో బ్యాట్ పెట్టడంతో… థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బకు రుతురాజు కాకుండా ప్రియాంష్ ఆర్య రనౌట్ కావాల్సి వచ్చింది. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించినప్పుడు మిడిల్ పిచ్ వరకు ప్రియాంష్ ఆర్య వెళ్లి వెనక్కి వచ్చి ఉంటే… రుతురాజ్ సేఫ్ అయ్యేవాడు. అప్పుడు ప్రియాంష్ ఆర్య ఔట్ కావాలి. కానీ ఇక్కడ ప్రియాంష్ ఆర్య కేవలం క్రీజు వదిలి బయటకు వెళ్లి… మళ్లీ వెనక్కి చేరుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ ను ఔట్ గా ప్రకటించకుండా… ప్రియాంష్ ఆర్య‌ను బ‌లి చేశారు అంపైర్లు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంపైర్లు నిద్రపోయారా? అనవసరంగా ప్రియాంష్ ఆర్యను రనౌట్ చేశారని ఫైర్ అవుతున్నారు. కాగా రనౌట్ నుంచి బయటపడ్డ రుతురాజు సెంచరీ మాత్రం చేసుకున్నాడు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

 

Related News

Bharti Fulmali: టీమిండియాలో ట్రాన్స్ జెండ‌ర్‌…భారతి ఫుల్మాలిపై దారుణంగా ట్రోల్స్‌

Mohsin Naqvi: జై షా కాళ్లు ప‌ట్టుకున్నా, టీమిండియా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవొద్దు !

Inzamam-ul-Haq: హర్భ‌జ‌న్ సింగ్ తో మాతో క‌లిసి న‌మాజ్ చేసేవారు !

5 సిక్సులు, 4 బౌండ‌రీలు..3 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన అర్జున్ టెండూల్క‌ర్

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

టెస్టుల్లో ఉండే ఫాలో-ఆన్ అంటే ఏంటి ? ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా ?

Big Stories

×