BigTV English
Advertisement

Ysrcp : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేశారా?

Ysrcp : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేశారా?

Ysrcp : 2019 ఎన్నికల్లో ఆ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీకే దక్కాయి. ఆ పార్టీ అంతబలంగా ఉన్న సింహపురి జిల్లాలో ఇప్పుడు వైసీపీ కుమ్ములాటలు మొదలయ్యాయి.


నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పదే పదే పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా తన ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో తనకు తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇదే సమయంలో వైసీపీ అధిష్టానం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని నియమించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇక శ్రీధర్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కొంతకాలంగా పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆనం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలు పట్టించుకోకుండా రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదన్నారు. తనకు ఉన్న సెక్యూరిటీని తగ్గించారని మండిపడ్డారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఆనం మాట్లాడటం హాట్ టాఫిక్ మారింది.


ఇప్పటికే ఆనం రాంనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం యాక్షన్ మొదలుపెట్టింది. ఆయనను కొన్నిరోజుల క్రితం వెంకటగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. అయినా సరే పార్టీ మారతానని ఆనం ప్రకటించలేదు.

ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్ఫందించారు. అసలు వాళ్ల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరమేంటి ? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు టీడీపీతో టచ్ లో ఉన్నారని సీఎం జగన్ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. అంటే పార్టీ మారేందుకు ముందే సిద్ధమై ఇలా వ్యూహాత్మకం ఆనం, కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? వారిద్ధరూ టీడీపీతో టచ్ లో ఉన్నారా? అందుకే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవుల నుంచి తప్పించారా? ..చూడాలి ఆనం, కోటంరెడ్డి ఎటు వైపు అడుగులు వేయబోతున్నారో..?

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×