E-Paper
Advertisement

Pithapuram Govt Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి.. విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

Pithapuram Govt Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి.. విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం
Advertisement

Pithapuram Govt Hospital: కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. చేబ్రోలుకి చెందిన దుర్గ మరణంపై పవన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దుర్గ ప్రసూతి మరణంపై తక్షణం నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ప్రసూతి మరణాలపై ఎప్పటికప్పుడు మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశం

కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రసూతి సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

జనసేన ఆర్థిక సాయం

Advertisement

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో దొండపాటి దుర్గ (30) బాలింతరాలు మృతి చెందింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అదేశాల మేరకు బుధవారం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు బాలింతరాలు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాలింతరాలుకు జన్మించిన పసిబిడ్డకు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Also Read: CM Chandrababu: పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు.. యూఏఈలో వరుస భేటీలు

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×