E-Paper
Advertisement

PM Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. రాజధానుల పేరిట లూటీ : పీఎం మోదీ

PM Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. రాజధానుల పేరిట లూటీ : పీఎం మోదీ
Advertisement

PM Modi Speech At Rajahmundry: ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. గోదావరి మాతకు ప్రణామాలు..ఈ నెల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాసారు. ఇక్కడ నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నాం అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ప్రచార సభలో వైసీపీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అవినీతిని జెట్ స్పీడ్ లో పరిగెత్తించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశం, ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యం అని అన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు.

Advertisement

టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. వైసీపీ కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆలస్యం చేసిందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశం కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వద్ద కోట్ల రూపాయల అక్రమ ధనం ఉందని ఆరోపించారు.

Also Read: రూటు మార్చిన కేఏపాల్, ఈసారి కొత్తగా..

Advertisement

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని అన్నారు. వైసీపీ రాష్ట్ర ఖజానాను కాళీ చేసిందని ఆరోపించారు. విశాఖ – చెన్నై కారడార్ నిర్మాణం చేపడతామని తెలిపారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏపీ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×