E-Paper
Advertisement

PM Modi Vizag Tour: వైజాగ్ ప్రధాని పర్యటన రద్దు? మరి రైల్వే జోన్ ప్రారంభోత్సవం లేనట్లేనా?

PM Modi Vizag Tour: వైజాగ్ ప్రధాని పర్యటన రద్దు? మరి రైల్వే జోన్ ప్రారంభోత్సవం లేనట్లేనా?
Advertisement

PM Modi Vizag Tour: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఈనెల 29న రావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు పీఎంఓ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఏపీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 164 సీట్లను కైవసం చేసుకున్న అనంతరం జరిగిన, సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పీఎం నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ తరువాత వైజాగ్ పర్యటన నిమిత్తం 29న ప్రధాని రావాల్సి ఉంది. ప్రధాని వస్తున్న సందర్భంగా స్వయంగా ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ గత మూడు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోడీ వస్తున్న సందర్భంగా.. భారీ ఏర్పాట్లకు కూటమి నేతలు శ్రీకారం చుట్టారు.

Advertisement

పర్యటన రద్దు కాకుంటే, వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే రోడ్ షోకు సైతం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. సుమారు రూ. 85 వేల కోట్లతో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు వైజాగ్ రైల్వే జోన్, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు ముందుగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రధాని పర్యటన రద్దయినట్లు సమాచారం. అయితే 29వ తేదీన వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారా, లేక వేరే తేదీని ఖరారు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Also Read: Case Against Aghori: లేడీ అఘోరీపై కేసు నమోదు.. బలిచ్చినట్లు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

Advertisement

విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాయి. ప్రత్యేకంగా ప్రధాని మోడీ అధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షణలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణం పూర్తి కాగా వైజాగ్ ప్రజల కల సాకారమైనట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. మొత్తం మీద ప్రధాని పర్యటించి ఉంటే తాము ప్రధానిని దగ్గర నుండి చూసే అవకాశం ఉండేదని, కానీ ప్రధాని పర్యటన రద్దు కావడం తమకు నిరాశకు గురి చేసిందని ప్రజలు అభిప్రాయ పడ్డారు.

Related News

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

Big Stories

Advertisement
×