E-Paper
Advertisement

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్..

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్..
Advertisement

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయుని పాలెంలో ఇవాళ షర్మిలా పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు పెట్టారు. గన్నవరం మండలం కేసరపల్లిలో గృహనిర్బంధం చేశారు. షర్మిలను హౌస్ అరెస్ట్ చేసి, ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో PCC చీఫ్ పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారు. షర్మిలా పర్యటన నేపధ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. ఆమె తన నివాసం నుంచి బయటకు రాకుండా బారికేడ్లు పెట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు పెట్టారు.

హౌస్ అరెస్టుపై వైఎస్ షర్మిలా తన ఎక్స్ వేధికగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలోని తన ఇంట్లో హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తనను ఎందుకు అరెస్ట్ చేశారో గల కారణాలు కూడా.. ఏపీ ప్రజలకు తెలియజెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక తన సొంత పని మీద ఏపీ పీసీసీ కార్యాలయానికి వెళుతున్న.. తనను అడ్డుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఇక తమ రాజ్యాంగం హక్కులను కాలరాయాలని చూస్తున్నారా అంటూ.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేధికగా రాసుకొచ్చారు.

Advertisement

హౌజ్ అరెస్ట్ పై వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఎందుకు ఆరెస్ట్ చేశారని, ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని పై రిసెర్చ్ కోసం అమరావతి క్యాపిటల్ కమిటి కాంగ్రెస్ పార్టీ తరపున వేశాం , కమిటి తరపున అమరావతి విజిట్ చేయాలని అనుకున్నాం. మేము కమిటి వేస్తే మీకు ఎందుకు భయం అని ప్రశ్నించారు ఆమె. ఇక ప్రొటెస్ట్ చేయాలనుకుంటే చంపేస్తారా.. ధర్నాలు, ప్రొటెస్ట్‌లు చేసే హక్కు లేదా అని అడిగారు. పోలీస్ వ్యవస్థను దేనికి వాడుతున్నారని నిలదీశారు. మీరు నియంతలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నా ఇంటి ముందు అంత మంది పోలీసులు ఎందుకు ఉంచారు. పోలీసులు తన పై చెయ్యి వేశారు, ఇదేనా మహిళలతో వ్యవహరించే పద్దతి.. రాష్ట్రం మహిళలపై అత్యాచారాల్లో మూడో స్థానంలో ఉంది.. ఇలాంటి వాటపై ఫోకస్ చేయాలన్నారు.

మరోవైపు.. మే 2న జరిగే ప్రధాని మోడీ సభకోసం అమరావతి ముస్తాబవుతోంది. ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అధికారులు.. రాజధాని గ్రామాల్లో రహదారులు బాగు చేస్తున్నారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలను సిద్ధమవుతున్నాయి. దాదాపు 90శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం పనులను పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

Also Read: సింహాచలం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల‌ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

ఇదిలా ఉంటే.. షర్మిలపై ప్రధాని మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారతదేశం నిఘా వ్యవస్థలపైనా, దేశ ప్రధాని మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×