E-Paper
Advertisement

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?
Advertisement

Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రసజ్ఞ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Advertisement

ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో రసజ్ఞ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Big Stories

Advertisement
×