E-Paper
Advertisement

Prabhala Theertham: కోనసీమలో కనుమ సందడి.. వైభవంగా జగ్గన్న తోట ప్రభల తీర్థం

Prabhala Theertham: కోనసీమలో కనుమ సందడి.. వైభవంగా జగ్గన్న తోట ప్రభల తీర్థం
Advertisement

కోనసీమ, స్వేచ్ఛ: సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఓవైపు కోడిపందాల జోరు. ఇంకోవైపు ఆటపాటలు, పిండివంటల ఘుమఘుమలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ప్రత్యేకతలు అనేకం. ఎక్కడెక్కడో ఉండే వారంతా, పెద్ద పండుగకు సొంత ఊరు వచ్చి అక్కడి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే కోనసీమలో అత్యంత పవిత్రంగా జరిగే ప్రభల తీర్థం ఈసారి కూడా వైభవంగా జరిగింది. సంక్రాంతి నుంచి ముక్కనుమ తర్వాతి రోజు దాకా అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుపుతారు. బుధవారం జగ్గన్న తోట ప్రభల తీర్థం కన్నులపండువగా సాగింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

Advertisement

కోనసీమలో ఎంతో ప్రత్యేకత చాటుకున్న ఈ ప్రభల తీర్థం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చిన్నా పెద్దా అందరూ చేరి ఒక్కటై తీర్థాన్ని చూడ్డానికి కోనసీమ సహా ఇతర ప్రాంతాలవాసులు కూడా తరలివచ్చారు. ఈసారి ఏకాదశ రుద్రుల ప్రభలను ఏర్పాటు చేసి ఊరేగించారు. వందల కేజీలకు పైనే బరువు ఉండే భారీ ప్రభలను మోసుకెళ్లారు ప్రజలు. పంట పొలాలు, కాలువలు దాటుకుంటూ జగ్గన్న తోటకు చేరుకున్నాయి. ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవని ప్రజలు తెలిపారు.

11 గ్రామాల నుంచి తీర్థాలు

Advertisement

ఎప్పటిలాగే ఈసారి కూడా 11 గ్రామాల నుంచి ప్రభలు తీర్థానికి చేరుకున్నాయి. ఆయా గ్రామాల్లో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి, భోగేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర స్వామి, చెన్నకేశవ మల్లేశ్వర స్వామి, మేనకేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి, రాఘవేశ్వర స్వామి, అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, భోగేశ్వర స్వామి జగ్గన్న తోటలో సమావేశమై లోక కల్యాణార్థం మాట్లాడుకుంటారని భక్తుల నమ్మకం. దానికి సంకేతంగా ఏటా ఆయా గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు చేరుకుంటాయి.

50 వేల మంది భక్తుల రాక

పంట పొలాలు, పచ్చని పొలాల మధ్య సాగే ఈ ప్రభల తీర్థం చూసేందుకు ఈసారి 50వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. గూడు బండ్లపైనే ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే, ఈసారి తీర్థంలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు జనంలోకి దూసుకెళ్లాయి. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Also Read: సంక్రాంతి బరిలో కోడి పందేలు పీక్స్.. నిషేధం ఉన్నా కారు, బుల్లెట్ బైక్ బహుమానంగా పోటీలు

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×