E-Paper
Advertisement

Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు.. తొలిరోజే వైసీపీ ప్రభుత్వంపై ఎటాక్..

Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు.. తొలిరోజే వైసీపీ ప్రభుత్వంపై ఎటాక్..
Advertisement

Purandeswari latest news(Andhra Pradesh political news today): ఏపీ రాజకీయాల్లో బీజేపీ వైఖరి ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇకమీద మరో లెక్కా? పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు నుంచి పగ్గాలు అందుకున్న ఆమె.. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశానికి ముందే మీడియా సమావేశం పెట్టారు. జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి అందిన ప్రతి పైసా లెక్కలు వివరించిన పురందేశ్వరి.. రాష్ట్ర సర్కార్ చేసింది ఏముందంటూ ప్రశ్నించారు.

ఏపీలో రాజకీయం మారుతోందా? ఇప్పటివరకు టీడీపీ, జనసేన – వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాను అలా కాదంటూ తొలి ప్రెస్‌మీట్‌తో చెప్పకనే చెప్పారు పురందేశ్వరి.

Advertisement

ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పురందేశ్వరి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ సందర్శించారు. తన తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఇచ్చిన పత్రాన్ని సమాధి వద్ద పెట్టి అంజలి ఘటించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు.

1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 12 మంది రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఆ బాధ్యతలు చేపట్టారు. వాళ్లందరూ పురుషులే. తొలిసారిగా బీజేపీ అధిష్టానం ఓ మహిళ నేతకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం విశేషం.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×