E-Paper
Advertisement

Aadhaar Mistake Ration: ఆ ఒక్క తప్పుతో.. రేషన్ కార్డుకు అనర్హులయ్యారా? ఇలా చేయండి!

Aadhaar Mistake Ration: ఆ ఒక్క తప్పుతో.. రేషన్ కార్డుకు అనర్హులయ్యారా? ఇలా చేయండి!
Advertisement

Aadhaar Mistake Ration: ఏపీలో రేషన్ కార్డ్ జాతర జరుగుతోంది. దీనితో అర్హులందరూ రేషన్ కార్డు కొరకు అప్లై చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఒక్క విషయంలో మాత్రం, అర్హులకు పెద్ద సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏమిటో తెలుసుకుందాం. దాని పరిష్కారం కూడా తెలుసుకుందాం.

బ్రతికి ఉంటే.. చనిపోయినట్లుగా నమోదయిందా?
మీరు బతికే ఉన్నా.. ప్రభుత్వం డేటాలో మాత్రం చనిపోయారని నమోదయిందా? అలా ఒక్క తప్పుడు ఆధార్ నమోదు వల్ల, చనిపోయినట్టు చూపించి, రేషన్ కార్డులో నుండి మీ పేరు తొలగించారా? అయితే మీకోసం ప్రభుత్వం ఇప్పుడు పరిష్కారం అందించింది. ఇక మీరు తిరిగి రేషన్ కార్డులో చేరవచ్చు. మరి ఆలస్యం చేయకండి.. ఈ కథనాన్ని పూర్తిగా చదవండి!

Advertisement

ఏం జరిగిందంటే…
ఇటీవల కాలంలో అనేకమంది పౌరులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సచివాలయ సిబ్బంది ఆధార్ నమోదు చేసేటప్పుడు తప్పుడు నెంబర్ ఎంటర్ చేయడం వల్ల అసలు వ్యక్తికి బదులుగా ఇంకెవరో చనిపోయినట్టు ప్రభుత్వ డేటాలో చూపబడుతోంది. దాంతో, వారిని రేషన్ కార్డు నుండి తొలగించి, అనేక పథకాల ప్రయోజనాలను నిలిపివేస్తున్నారు. ఇది చిన్న తప్పు అనిపించినా, గరిష్టంగా దెబ్బ తినేది పేద కుటుంబాలే.

ఇప్పుడు పరిష్కారం సిద్ధం!
ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ePDS వెబ్‌సైట్ లో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తాసిల్దార్ లాగిన్‌లో Death Reversal అనే ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా చనిపోయినట్టు తప్పుడు నమోదు అయిన వారిని తిరిగి రేషన్ కార్డులో చేర్చే అవకాశం వచ్చింది.

Advertisement

ప్రక్రియ ఎలా ఉంటుంది?
సచివాలయ సిబ్బంది బాధిత వ్యక్తిని కలిసే, ఆయన ఒరిజినల్ ఆధార్, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారు. బాధితుడు నిజంగా బతికే ఉన్నారని నిర్ధారించిన తర్వాత చర్యలు ప్రారంభమవుతాయి. తాసిల్దార్ లాగిన్‌లోకి వెళ్లి Death Reversal అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తారు. అక్కడ బాధితుడికి చెందిన సరికొత్త ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తారు. రేషన్ కార్డు నుండి తొలగించిన సభ్యుడిని తిరిగి చేర్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది పూర్తయిన తర్వాత, Addition of Member ఆప్షన్ ద్వారా బాధితుడిని తిరిగి చేర్చవచ్చు.

Also Read: IMD Alert: మళ్లీ మబ్బులు, చినుకులు.. హైదరాబాద్ కు భారీ వర్షసూచన!

ఈ ప్రక్రియ ఎవరికి ఉపయోగపడుతుంది?
తప్పుడు ఆధార్ నంబర్ వల్ల రేషన్ కార్డు నుంచి తొలగించబడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికేట్ లేకుండానే చనిపోయినట్టు రిజిస్టర్ చేయబడ్డ వారు, ఆధార్ డేటాలోని పొరపాట్ల వల్ల ప్రభుత్వం తప్పుడు నిర్ణయానికి వచ్చిన వారికీ ఇదొక సువర్ణవకాశమని చెప్పవచ్చు.

రేషన్ కార్డు అనేది కేవలం అన్నదాత పథకానికి మాత్రమే కాదు. ఇది పింఛన్, ఆరోగ్య బీమా, విద్యా పథకాలు వంటి అనేక సంక్షేమ పథకాలకు ఆధారంగా మారుతుంది. అందువల్ల ఇది చెల్లని సమస్య కాదు. కుటుంబం మొత్తం జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత సమగ్రంగా తీర్చిదిద్దుతోంది.

ప్రజల కోసం సూచనలు..
మీ రేషన్ కార్డు నుండి ఎవరి పేరు తొలగించబడిందో తెలుసుకోండి. వారి ఆధార్ నంబర్ సరైందా, కాదు తెలుసుకోండి. సచివాలయ సిబ్బందిని వెంటనే సంప్రదించండి. అవసరమైన డాక్యుమెంట్స్ (ఆధార్, ఫోటో, మొబైల్ నెంబర్) వెంట తీసుకెళ్లండి. Death Reversal కోసం రిక్వెస్ట్ పెట్టండి. ఆ తరువాత Addition of Member ద్వారా మళ్లీ చేర్పు అవుతారు.

ఎందుకంటే…
ఇది కేవలం ఒక పేరు సమస్య కాదు. ఇది ఒక కుటుంబం జీవనాధారం సమస్య. దాంతోపాటు, పథకాలపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు తిరిగి మీ హక్కును పొందొచ్చు. ఇది ప్రభుత్వ పరిష్కార సామర్థ్యానికి నిదర్శనం కూడా. ఒక్క చిన్న ఆధార్ తప్పుతో మీ జీవితం మొత్తం మారిపోనివ్వకండి. మీరు చనిపోయినట్టు చూపించారంటే, ఇప్పుడే సచివాలయం వెళ్లి మీ ఆధార్ నెంబర్ సరి చేయించుకోండి. Death Reversal ద్వారా మళ్లీ మీ పేరు రేషన్ కార్డులో చేర్చించుకోండి. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే.. మీ హక్కు మీకే, రేషన్ మీ ఇంటికే వస్తుంది!

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×