E-Paper
Advertisement

Kapu Ramachandra Reddy : వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. పార్టీకి రాయదుర్గం ఎమ్మెల్యే గుడ్ బై..

Kapu Ramachandra Reddy : వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. పార్టీకి రాయదుర్గం ఎమ్మెల్యే గుడ్ బై..
Advertisement

Kapu Ramachandra Reddy : వైసీపీకి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి కాపు రామచంద్రారెడ్డి వచ్చారు. కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.

తనకు టిక్కెట్ ఇవ్వడంలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్‌ను నమ్మి కాంగ్రెస్‌ నుంచి వచ్చానన్నారు. మంత్రి పదవి ఇస్తామన్న మాట తప్పారని మండిపడ్డారు. పార్టీ కోసం గడప గడపకూ తిరిగానని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ చెప్పిన ప్రతి పని చేశానన్నారు. సర్వే పేరు చెప్పి టిక్కెట్ నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు.

Advertisement

తమ కుటుంబం వైసీపీని వీడుతుందని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగనే తమ సర్వస్వం అనుకుంటే జీవితాలు సర్వనాశనం అయ్యాయని కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

.

Advertisement

.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×