E-Paper
Advertisement

Tarakaratna: లోకేశ్ తో తారకరత్న భేటీ.. అందుకోసమేనా?

Tarakaratna: లోకేశ్ తో తారకరత్న భేటీ.. అందుకోసమేనా?
Advertisement

Tarakaratna: నందమూరి తారకరత్న. ప్రస్తుతం సినిమాలు తక్కువ. వెబ్ సిరీస్ లో కాస్త మెరుస్తున్నారు. అవకాశాలు లేవనో.. రాజకీయాలపై మక్కువతోనే.. పొలిటికల్ ఎంట్రీకి ఆరాటపడుతున్నారు. తనది నందమూరి ఫ్యామిలీ కావడంతో.. స్వతహాగానే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ అంటున్నారు. అలాంటి తారకరత్న.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలవడంపై చర్చ జరుగుతోంది. వారిద్దరి భేటీకి కారణం ఏంటా? అనే చర్చ నడుస్తోంది.

మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యామని చెబుతున్నారు. అలాగైతే ఓ ఫోన్ కాల్ చేసుకుంటే సరిపోతుందిగా..అంటున్నారు. వారి భేటీ.. రాజకీయ భేటీనేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

Advertisement

అప్పట్లో నారా భువనేశ్వరి మీద అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం అంతా ఆగ్రహంగా ఉంది. అప్పటి నుంచి ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇదే సమయంలో తారకరత్న సైతం రాజకీయాలపై ఆసక్తిగా ఉండటంతో టీడీపీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్నారు. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పారు. అప్పటినుంచీ తారకరత్న పోటీపై చర్చ జరుగుతోంది.

తాజాగా లోకేశ్ ను తారకరత్న కలవడంతో.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. నందమూరి కుటుంబ సభ్యుడైన తారకరామ అడిగితే.. ఏ సీటైనా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంటుంది. మరి, ఆ సీటు ఏ సీటు? అనేదానిపైనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తారకరత్న గతంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదైనా ఒక స్థానం నుంచి తారకరత్న పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

మరోవైపు, నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తారకరత్న కలిసి ఉంటారని కూడా అంటున్నారు. అయితే, ఎమ్మెల్యేగా పోటీ కంటే ముందే టీడీపీలో యాక్టివ్ కావాలనే ఉద్దేశంలో తారకరత్న ఉన్నారని.. ఇదే విషయంపై లోకేశ్ తో చర్చించారని కూడా చెబుతున్నారు. కారణం ఏదైనా.. లోకేశ్, తారకరత్నల భేటీ నందమూరి, టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×