E-Paper
Advertisement

RK Roja: చంద్రబాబూ..ఈ ప్రశ్నలకు బదులేది? రోజా ఆన్‌ ఫైర్‌

RK Roja: చంద్రబాబూ..ఈ ప్రశ్నలకు బదులేది? రోజా ఆన్‌ ఫైర్‌
Advertisement

తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలని రోజా డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు అంటూ.. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ మీద ఉన్న శ్రద్ధ భక్తుల మీదా లేదా అంటూ రోజా ఫైర్ అయ్యారు.

Advertisement

కాగ.. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటుచేసిన టోకెన్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. మరో 48 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అస్వస్థతకు గురైనవారిని స్విమ్స్‌, రుయా హాస్పిటల్స్‌కు తరలించారు. కాగా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి 32 మందిని డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు.

మిగతా 16 మంది స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. స్విమ్స్‌ అత్యవసర విభాగంలో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మెరుగైన చికిత్స కోసం రుయా నుంచి స్విమ్స్‌కు 8 మందిని తరలించారు. ప్రస్తుతం రుయాలో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, వైజాగ్‌కు చెందిన రజిని, లావణ్య, బళ్లారికి చెందిన నిర్మల, సేలంకు చెందిన మల్లిగ మృతిచెందారు.

Advertisement

Also Read: ఘటన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సందర్శన.. ఈవోపై ప్రశ్నల మీద ప్రశ్నలు

ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో.. ఊపిరాడక పలువురు భక్తులు కిందపడిపోయారు. పోలీసులు వెంటనే CPR చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. బైరాగిపట్టెడలో ఏర్పాటుచేసిన టోకెన్‌ కేంద్ర వద్ద ఘటన జరిగింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×