BigTV English
Advertisement

RK Roja: చంద్రబాబూ..ఈ ప్రశ్నలకు బదులేది? రోజా ఆన్‌ ఫైర్‌

RK Roja: చంద్రబాబూ..ఈ ప్రశ్నలకు బదులేది? రోజా ఆన్‌ ఫైర్‌

తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలని రోజా డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు అంటూ.. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ మీద ఉన్న శ్రద్ధ భక్తుల మీదా లేదా అంటూ రోజా ఫైర్ అయ్యారు.

కాగ.. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటుచేసిన టోకెన్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. మరో 48 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అస్వస్థతకు గురైనవారిని స్విమ్స్‌, రుయా హాస్పిటల్స్‌కు తరలించారు. కాగా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి 32 మందిని డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు.


మిగతా 16 మంది స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. స్విమ్స్‌ అత్యవసర విభాగంలో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మెరుగైన చికిత్స కోసం రుయా నుంచి స్విమ్స్‌కు 8 మందిని తరలించారు. ప్రస్తుతం రుయాలో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, వైజాగ్‌కు చెందిన రజిని, లావణ్య, బళ్లారికి చెందిన నిర్మల, సేలంకు చెందిన మల్లిగ మృతిచెందారు.

Also Read: ఘటన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సందర్శన.. ఈవోపై ప్రశ్నల మీద ప్రశ్నలు

ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో.. ఊపిరాడక పలువురు భక్తులు కిందపడిపోయారు. పోలీసులు వెంటనే CPR చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. బైరాగిపట్టెడలో ఏర్పాటుచేసిన టోకెన్‌ కేంద్ర వద్ద ఘటన జరిగింది.

Related News

CM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు? ఉదయం రాత్రి వరకు సమీక్షలు

Cyclone Montha Impact: తుఫాన్ ప్రభావిత జిల్లాలపై పవన్ ఫోకస్.. నష్టంపై వివరాలు సేకరణ, పునరుద్దరణ చర్యలు చేపట్టాలని ఆదేశం

Montha Disaster in AP: ఏపీలో మొంథా బీభత్సం.. విశాఖ-అరకు రైల్వే ట్రాక్ ధ్వంసం, చెట్లు-విద్యుత్ స్తంభాలు

Cyclone Montha Update: మొంథా తుఫాను తీరం దాటింది..శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్

Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Jagan Tweet: ఆ ట్వీట్ సరే.. జగన్ ఈ ట్వీట్ కూడా వేస్తే బాగుండేది

Big Stories

×