E-Paper
Advertisement

Kodi Kathi Case: కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Kodi Kathi Case: కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Advertisement

Kodi Kathi Case: ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసులో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

జగన్ పై కోడి కత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు గతంలో ఐదేళ్ల తరువాత హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. ఈ క్రమంలో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమంటూ నిరాకరిస్తూ కీలక తీర్పును వెల్లడించింది.

Advertisement

Also Read: శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్

అయితే, కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్రా లేదంటూ ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ ను ఎన్ఐఏ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టు విచారణలోనే ఉంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×