E-Paper
Advertisement

DSPs transferred: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్‌ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు!

DSPs transferred: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్‌ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు!
Advertisement

DSPs transferred in AP(Latest news in Andhra Pradesh): ఏపీలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

మొత్తంగా 96 మందిని డీఎస్పీలను బదిలీ చేయగా.. వీరిలో పలువురు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిగతా 57 మందిని మాత్రం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలంటూ వారికి సూచించింది. బదిలీ అయిన డీఎస్పీ ఎధికారుల్లో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తోపాటు ఇతర పలు విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.

Advertisement

Also Read: మాటలొద్దు జగన్.. దమ్ముంటే అసెంబ్లీకి రా : మంత్రి పార్థసారథి

ఇదిలా ఉంటే.. మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ఆయన సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014 – 2019 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా, 2019-24 మధ్య ఏడు శాతం మాత్రమే ఉందంటూ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టంపై ఈ సమీక్షలో చర్చించారు. అయితే, ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు రూ. 1,025 కోట్ల వరకు చెల్లించలేదంటూ అధికారుల తేల్చినట్టు తెలుస్తోంది.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×