BigTV English

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు పడలేదంటే ? : వైఎస్ షర్మిల

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు పడలేదంటే ? : వైఎస్ షర్మిల

YS Sharmila: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఫర్ జగన్.. అగెనెస్ట్ జగన్ పేరుతో ఏపీలో ఎన్నికలు జరిగాయని అన్నారు. అంతే కాకుండా ప్రజలు మార్పు కోసం జగన్‌ను ఓడించారని తెలిపారు. ప్రజలు ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక పోయిందని చెప్పారు.


రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని ఏఐసీసీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకులు నిర్వహించగా ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి తగిన సమయం లేకపోవడం వల్లే కడపలో ఎంపీగా గెలవలేకపోయానని చెప్పారు.

రాహుల్ గాంధీ దెబ్బకు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చతికిల పడిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పేరే తప్ప.. బీజేపీ చేతిలో పవర్ లేదని అన్నారు. సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండేది కాదన్నారు.


Also Read: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని షర్మిల అన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి మాట మార్చారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన ఎంపీల వల్లే బీజీపీ అధికారంలో ఉందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×