E-Paper
Advertisement

జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

జగన్ అసలు రంగు బయటపడింది..  వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు,  వైఎస్ షర్మిల ఫైర్
Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అక్రమ పొత్తు ఇప్పుడు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు.

బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు గొర్రెలా గుడ్డిగా మద్దతు తెలపడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు. విపక్ష హోదాలో ఉంటూ అధికార పక్షానికి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా తన వ్యక్తిగత కేసుల నుంచి రక్షణ పొందడమే జగన్‌కు ముఖ్యమైపోయిందని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో సాగించిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మోదీ ముందు మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

దేశ రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టే బిల్లులను వ్యతిరేకించాల్సింది పోయి భజన చేయడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. టీడీపీ లేదా జనసేన కంటే ఎక్కువగా జగన్ మోదీని మోస్తున్నారని విమర్శించారు. అక్రమ డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా ఓటు వేయడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే జగన్‌కు బీజేపీ మెప్పు పొందడమే పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలను జగన్ మంటగలుపుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వారసత్వాన్ని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజల గొంతు కోస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న ఇలాంటి నీచపు పనుల వల్ల వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన చెందారు. విపక్షాలు ఐక్యంగా పోరాడి విజయం సాధిస్తుంటే జగన్ మాత్రం దొంగ బిల్లులకు ఓటేసి రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరిచారని దుయ్యబట్టారు. విలువలతో కూడిన రాజకీయాలను జగన్ వదిలేశారని విమర్శించారు.

Advertisement

సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని షర్మిల విమర్శించారు. రాజకీయాల్లో ఉండాల్సిన కనీస నైతికతను జగన్ విస్మరించారని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి విపక్షాలకు మద్దతు ఇవ్వకపోవడం లోకంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. బీజేపీ కోసమే జగన్ తన సొంత కాకి లెక్కలు అల్లుతున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ALSO READ: మహిళా బిల్లును అడ్డుకొని.. తెలంగాణకు అన్యాయం చేశారు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×