E-Paper
Advertisement

Vizag News: ఆ శిశువు జననమే మహా అద్భుతం.. వైజాగ్ లో వెలుగులోకి.. అసలేం జరిగిందంటే?

Vizag News: ఆ శిశువు జననమే మహా అద్భుతం.. వైజాగ్ లో వెలుగులోకి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Vizag News: ఆ శిశువు జన్మకు ఏ పరమార్థం ఉందో కానీ, జన్మతః అద్భుతాన్ని సృష్టించింది. చనిపోయిందని ఆ శిశువు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి కన్నీటి వ్యథను ఆ దేవుడు ఆలకించాడో ఏమో కానీ, ఆ శిశువు శరీరంలో ఉన్నట్లుండి కదలికలు వచ్చాయి. ఇక అంతే వైద్యులు అలర్ట్ అయ్యారు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?

విశాఖ కేజీహెచ్ లో అద్భుతం జరిగింది. అది కూడా మహా అద్భుతమే అంటున్నారు ఆ శిశువు తల్లిదండ్రులు. విశాఖ కేజీహెచ్ కు ఓ మహిళ ప్రసవ వేదనతో కాన్పుకై వచ్చింది. సదరు మహిళకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆ మహిళ పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన సమయం నుండి ఒక్క కదలిక లేదు. డాక్టర్లు రాత్రంతా శ్రమించారు. బిడ్డలో మాత్రం ఎటువంటి కదలిక ఆనవాళ్లు వారికి కనిపించలేదు. ఆ తల్లిదండ్రులు మాత్రం బిడ్డ ఆరోగ్యం కుదుట పడాలని వేడుకుంటున్నారు.

Advertisement

చిట్టచివరకు ఆ శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండంటి బిడ్డ పుట్టిందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రుల కళ్లు చెమ్మగిల్లాయి.. రోదించాయి. అప్పటికే వైద్యులు, బిడ్డ చనిపోయినట్లు రికార్డుల్లో కూడా నమోదు చేశారట. చివరకు ఆ శిశువును వారి తల్లిదండ్రులకు అప్పగించారు వైద్య సిబ్బంది.

Also Read: Posani Serious Comments: ప్రశ్నిస్తే ఖేల్ ఖతమా? మీకు భయపడాలా? మీరు మాత్రం పవిత్రులా? పోసాని సీరియస్

Advertisement

బిడ్డను ఎత్తుకున్న తల్లి రోదనకు కన్నీళ్లు సముద్రాన్ని తలపించేలా ప్రవహిస్తున్నాయి. అంతలోనే తన చేతిలోని బిడ్డ శరీరంలో కదలికలు వచ్చినట్లు ఆ తల్లి గమనించింది. దేవుడా అంటూ .. వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు బిడ్డ తల్లిదండ్రులు. డాక్టర్లు కూడా అంతే వేగంతో కావాల్సిన వైద్యాన్ని అందించారు. చివరకు బిడ్డ సేఫ్ అంటూ వైద్యులు చెప్పేశారు.

అయ్యా.. మాకు దేవుడిచ్చిన బిడ్డయ్యా అంటూ ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. ఏదిఏమైనా ఇక ఆశలు వదులుకొని వెళ్తున్న క్రమంలో, బిడ్డ బ్రతకడం, డాక్టర్లు అంతే స్థాయిలో స్పందించడంతో శిశువు తల్లిదండ్రులు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×