E-Paper
Advertisement

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?
Advertisement

Ysrcp: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ నేతలు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. పేర్ని నాని విషయం పక్కనబెడితే.. పోసాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మచ్చుకైనా కనిపించలేదు. ఎన్నికలు 100 రోజులు పూర్తి అయ్యింది. ఇన్నాళ్లూ ఎక్కడున్నారో తెలీదు. బెజవాడ వరదల్లో పత్తా లేకుండా పోయారు. కొందరేమో విదేశాలకు, మరికొందరు హైదరాబాద్‌కు వెళ్లినట్టు వార్తలొచ్చాయి. కాకపోతే లడ్డూ వివాదం వీరిని బయటకు తెచ్చింది.

తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చాలా ఇబ్బందిపడ్డారు. నేతలెవరూ అందుబాటులోకి రాలేదు. ప్రతీసారీ ఆయన ఒక్కరే మాట్లాడి ఖండిస్తున్నారు. ఈ క్రమంలో చాలా విషయాల్లో మీడియాకు దొరికిపోయారు. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పదవులు అనుభవించిన నేతలు పరారీలో ఉంటారంటూ జోరుగా వార్తలు సాగాయి. అయినా సరే వారెవరూ పట్టించు కోలేదు. శుక్రవారం సాయంత్రం మీడియా ముందుకొచ్చిన జగన్, తాను తిరుమల వెళ్లలేదని చెప్పేశారు.

Advertisement

అంతకుముందు పార్టీలో కీలక నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. ఏయే విషయాలు మీడియా ముందు మాట్లాడాలని, అసలు పాయింట్‌ను ఎలా డైవర్ట్ చేయాలనే దానిపై ఓ అంచనాకు వచ్చారు. లడ్డూ వ్యవహారంలో మొదటి నుంచి అధికార పార్టీ వైఖరి తప్పంటూ ప్రయత్నించింది. తాము చేసిందే కరెక్ట్ అని సమర్థించేందుకు నేతలు ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు.

నార్మల్‌గా కొడాలి, వల్లభనేని, పోసాని మీడియా ముందు రావడానికి పెద్దగా ఇష్టపడ లేదట. కాకపోతే అధినేతపాటు మరికొందరు రిక్వెస్ట్ చేయడంతో బయటకు వచ్చి మాట్లాడాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారని అంటున్నారు. ఆదివారం పోసాని మీడియా ముందుకొచ్చి ఆ విషయాన్ని డైవర్ట్ చేసి నేరుగా మంత్రి నారా లోకేష్‌ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా.. వరదాల్లో ఏమైపోయారు? అప్పుడు సాయానికి రాని వ్యక్తులు.. ఇప్పుడు పార్టీలో మనుగడ కోసం మీడియా ముందుకు వచ్చారా అంటూ సోషల్ మీడియాలో జోరుగా రచ్చ నడుస్తోంది. జనం వద్దు.. కానీ, ‘లడ్డు’ రాజకీయాలు కావాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

ALSO READ: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

వైసీపీ నేతల్లో మునుపటి మాదిరిగా ఫైర్ కనిపించలేదంటున్నారు ఆ పార్టీలో కొందరు నేతలు. గతంలో మాదిరిగా ప్రస్తుతం మీడియా ముందు గట్టిగా నోరెత్తే సాహసం సైతం చేయలేదు. కాకపోతే బురద జల్లడం కంటిన్యూ చేశారు. వంశీ అయితే మీడియాతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడలేదు.  దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న చర్చ మొదలైపోయింది. సమావేశం తర్వాత నేతలు మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారని తెలుస్తోంది.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×