BigTV English

AP Assembly Sessions 2024 : శాసనసభలో నిరసన.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

AP Assembly Sessions 2024 : శాసనసభలో నిరసన.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. శాసన సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ విపక్ష ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు.


టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు విరమించాలని కోరారు. అయినా సరే టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు కొనసాగించారు. దీంతో ఒకరోజుపాటు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.

కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్‌, ఆదిరెడ్డి భవాని, ఏలూరి సాంబశివరావు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్‌ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×